సంగారెడ్డి జిల్లా మాడిగి రోడ్డులో మారుతి వ్యాన్ దగ్ధమైంది. మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామంలో జరిగిన వివాహానికి కర్ణాటకలోని మన్నెకెళ్లి పట్టణానికి చెందిన అంబాదాస్ భార్యాబిడ్డలతో వచ్చారు. తిరుగు ప్రయాణంలో మాడిగి వద్దకు రాగానే మారుతి వ్యాన్లో గ్యాస్ లీక్ అవుతున్న వాసన రావటంతో అప్రమత్తమైన అంబదాస్ కుటుంబ సభ్యులతో కిందికి దిగిపోయాడు.
వెనువెంటనే మంటలు వ్యాపించి క్షణాల్లో మారుతి వ్యాన్ కాలి బూడిదయింది. ఘటన స్థలాన్ని చిరాగ్పల్లి ఎస్సై గణేశ్ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: ముగ్గురు ఎంపీలు, సీఎల్పీ నేతకు దిల్లీ నుంచి పిలుపు