ETV Bharat / jagte-raho

తల్లి, కొడుకు కలిసి.. కన్నతండ్రిని కడతేర్చారు

author img

By

Published : Sep 24, 2020, 5:06 PM IST

తల్లికొడుకులు కలిసి.. తండ్రిని కడతేర్చిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో చోటు చేసుకుంది. గుండాల గ్రామానికి చెందిన తల్లి లలిత, కొడుకు రమేష్​లు కలిసి హత్యచేసి పొలంలో పాతిపెట్టారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి నిలదీయగా నిజం చెప్పారు.

man murdered by wife and son in chevella
తల్లికొడుకు కలిసి.. కన్నతండ్రిని కడతేర్చారు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాలె కిష్టయ్యను కన్న కొడుకు, కట్టుకున్న భార్య కలిసి హత్య చేసి.. పొలంలో పాతి పెట్టారు. గత 45 రోజులుగా కిష్టయ్య కనిపించకపోవడం పట్ల అనుమానించిన కుటుంబ సభ్యులు మృతుడి కొడుకు రమేష్​ను నిలదీయగా.. తల్లితో కలిసి పథకం ప్రకారం కిష్టయ్యను హత్య చేసి.. పొలంలో పాతిపెట్టినట్టు చెప్పాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బంధువుల ఫిర్యాదు మేరకు లలిత, రమేష్​లను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు చంపారన్న విషయం తెలియాల్సి ఉందని.. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాలె కిష్టయ్యను కన్న కొడుకు, కట్టుకున్న భార్య కలిసి హత్య చేసి.. పొలంలో పాతి పెట్టారు. గత 45 రోజులుగా కిష్టయ్య కనిపించకపోవడం పట్ల అనుమానించిన కుటుంబ సభ్యులు మృతుడి కొడుకు రమేష్​ను నిలదీయగా.. తల్లితో కలిసి పథకం ప్రకారం కిష్టయ్యను హత్య చేసి.. పొలంలో పాతిపెట్టినట్టు చెప్పాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బంధువుల ఫిర్యాదు మేరకు లలిత, రమేష్​లను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు చంపారన్న విషయం తెలియాల్సి ఉందని.. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.