ETV Bharat / jagte-raho

విహారానికి వెళ్లి జలప్రవాహానికి కొట్టుకుపోయాడు! - man who went for picnic died drowning in water

విహారయాత్ర ఇంటవిషాదాన్నే మిగిల్చింది. కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు, తోబుట్టువులు చూస్తుండగానే జలప్రవాహానికి ఓ వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగింది.

man drowned in water infront of family
విహారానికి వెళ్లి జలప్రవాహానికి కొట్టుకుపోయాడు!
author img

By

Published : Sep 21, 2020, 10:04 AM IST

కళ్లెదుటే తమకు కావాల్సిన వ్యక్తి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోతుంటే ఆ కుటుంబీకుల వేదన వర్ణించలేనిది. ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలోని పెద్దవాగులో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన సురేష్​.. తన నాలుగేళ్ల కుమారుని పుట్టినరోజు సందర్భంగా గుమ్మడవెల్లి వద్దనున్న పెద్ద వాగు వద్దకు విహారానికి వచ్చారు.

సురేష్​తో పాటు భార్యాపిల్లలు, చెల్లెలు, బావమరిది పెదవాగు వద్దకు వెళ్లారు. వారంతా స్నానం చేసేందుకు వాగులోకి దిగారు. అందరు చూస్తుండగానే వాగులో నీటి ప్రవాహానికి సురేష్​ కొట్టుకుపోయాడు. గ్రామస్థులు గాలించి సురేష్​ను బయటకు తీయగా.. అప్పటికే అతను మరణించాడు. అతని మరణంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కళ్లెదుటే తమకు కావాల్సిన వ్యక్తి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోతుంటే ఆ కుటుంబీకుల వేదన వర్ణించలేనిది. ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి సమీపంలోని పెద్దవాగులో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన సురేష్​.. తన నాలుగేళ్ల కుమారుని పుట్టినరోజు సందర్భంగా గుమ్మడవెల్లి వద్దనున్న పెద్ద వాగు వద్దకు విహారానికి వచ్చారు.

సురేష్​తో పాటు భార్యాపిల్లలు, చెల్లెలు, బావమరిది పెదవాగు వద్దకు వెళ్లారు. వారంతా స్నానం చేసేందుకు వాగులోకి దిగారు. అందరు చూస్తుండగానే వాగులో నీటి ప్రవాహానికి సురేష్​ కొట్టుకుపోయాడు. గ్రామస్థులు గాలించి సురేష్​ను బయటకు తీయగా.. అప్పటికే అతను మరణించాడు. అతని మరణంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.