ETV Bharat / jagte-raho

రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య - Man commits suicide on Charlapalli-Moulali railway line

రైలు పట్టాలపై తల పెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే జీఆర్​పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Man commits suicide on rails
రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Jan 2, 2021, 10:29 PM IST

చర్లపల్లి-మౌలాలి రైలు మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే జీఆర్​పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఘటనాస్థలికి రైల్వే పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని వద్ద ఉన్న కీ చైన్​పై వినోద్ అని రాసి ఉన్నట్టు గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చాడు, చని పోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: సైబర్​ నేరాలపై అవగాహన అవసరం: సీపీ ప్రమోద్ కుమార్

చర్లపల్లి-మౌలాలి రైలు మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే జీఆర్​పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఘటనాస్థలికి రైల్వే పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని వద్ద ఉన్న కీ చైన్​పై వినోద్ అని రాసి ఉన్నట్టు గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చాడు, చని పోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: సైబర్​ నేరాలపై అవగాహన అవసరం: సీపీ ప్రమోద్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.