ETV Bharat / jagte-raho

కూల్చేయడానికి వెళ్తే కుమ్మేశారు..

మాదాపూర్​లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వెళ్లిన జీహెచ్​ఎంసీ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. కూల్చివేతలను అడ్డుకుని చితకబాదారు.

author img

By

Published : Feb 14, 2019, 6:08 AM IST

టౌన్​ ప్లానింగ్​ సిబ్బందిపై దాడి

హైదరాబాద్​ మాదాపూర్​లోని భాగ్యనగర్ వెల్ఫేర్ సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడానికి వెళ్లిన టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కూల్చివేతలను అడ్డుకుని కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తుతెలియని వ్యక్తులు చితకబాదారు. అనంతరం వారిని కారులో తీసుకెళ్లి మాదాపూర్ పోలీస్​ స్టేషన్ ఎదుట వదిలి పారిపోయారు.

విషయం తెలుసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకోవడమే కాకుండా సిబ్బందిపై దాడి చేసి.. జేసీబీలు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానిపై కేసు నమోదు చేశారు.

టౌన్​ ప్లానింగ్​ సిబ్బందిపై దాడి
undefined

హైదరాబాద్​ మాదాపూర్​లోని భాగ్యనగర్ వెల్ఫేర్ సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడానికి వెళ్లిన టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కూల్చివేతలను అడ్డుకుని కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తుతెలియని వ్యక్తులు చితకబాదారు. అనంతరం వారిని కారులో తీసుకెళ్లి మాదాపూర్ పోలీస్​ స్టేషన్ ఎదుట వదిలి పారిపోయారు.

విషయం తెలుసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకోవడమే కాకుండా సిబ్బందిపై దాడి చేసి.. జేసీబీలు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానిపై కేసు నమోదు చేశారు.

టౌన్​ ప్లానింగ్​ సిబ్బందిపై దాడి
undefined
Note: Script Ftp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.