ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఘన్పూర్ అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న మద్యం వాహనాన్ని పట్టుకున్నారు. ఉల్లిగడ్డల మాటున మహారాష్ట్ర నుంచి టాటా ఏస్ పిక్ అప్ వాహనంలో తరలిస్తున్న రూ.2.30లక్షల విలువైన 93 కాటన్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్తోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎక్సైజ్ సీఐ రాజమౌళి తెలిపారు.
ఇదీ చూడండి: 11 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం