ETV Bharat / jagte-raho

గాలి జనార్దన్ ​​రెడ్డి బంధువులను బెదిరించారు.. పోలీసులకు చిక్కారు

author img

By

Published : Oct 1, 2020, 11:02 PM IST

డబ్బులు సంపాదించడానికి మోసగాళ్లు విభిన్న దారులు వెతుకుతున్నారు. ఏకంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతల బంధువులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా.. కర్ణాటక భాజపా నాయకుడు గాలి జనార్దన్ ​​రెడ్డి బంధువులను బెదిరించి.. డబ్బులు గుంజేందుకు ఓ ముఠా ప్రయత్నించింది. అయితే ఏపీ కర్నూలు పోలీసులు మాత్రం వారి ఆట కట్టించారు.

గాలి జనార్థన్​రెడ్డి బంధువులను బెదిరించారు.. పోలీసులకు చిక్కారు
గాలి జనార్థన్​రెడ్డి బంధువులను బెదిరించారు.. పోలీసులకు చిక్కారు

కర్ణాటక భాజపా నేత గాలి జనార్దన్​​ రెడ్డి మామ (భార్య తండ్రి) పరమేశ్వర రెడ్డిని బెదిరించిన నలుగురిని.. ఏపీ కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అంబర్​పేటకు చెందిన మహమ్మద్ నజీర్, లంగర్​హౌస్​కు చెందిన గంగ అలియాస్ సంగీత రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన పెంకే శ్రీమన్నారాయణమూర్తి, పెంకే లక్ష్మీ కలిసి.. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు కాకనూరు గ్రామంలో నివాసముంటున్న పరమేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి బెదిరించారు.

గాలి జనార్దన్ రెడ్డి భార్య 28 సంవత్సరాల కిందట కవల ఆడ పిల్లలను ప్రసవించిందని వారిలో గంగ అలియాస్ సంగీతా రెడ్డి ఒకరని చిత్రాలు చూపించారు. మనవరాలుగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. పుట్టిన వెంటనే కవలల్లో ఒకరిని ఆస్పత్రి నర్సు ఎత్తుకెళ్లి తర్వాత ఇచ్చినట్లు కథ రచించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో చెప్పి పరువు మర్యాదలకు భంగం కలిగిస్తామని బెదిరించారు. రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనుమానాస్పదంగా ఉన్న వీరి తీరుపై పరమేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరిపి నలుగురిని అరెస్టు చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. మహమ్మద్ నజీర్, గంగ అలియాస్ సంగీత రెడ్డి భార్య భర్తలు. వారి ఇంట్లో పని మనుషులుగా శ్రీమన్నారాయణ మూర్తి, లక్ష్మీ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో గాలి జనార్దన్​​ రెడ్డి వివరాలు సేకరించారు. గాలి జనార్దన్ రెడ్డి మామ పరమేశ్వర రెడ్డి.. బండి ఆత్మకూరు మండలం కాకనూరు గ్రామంలో ఉంటారని తెలుసుకుని ఇలా చేశారని పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: కేశినేని నాని తమ్ముడినంటూ మోసం..డబ్బు వసూలు చేసి పరారీ

కర్ణాటక భాజపా నేత గాలి జనార్దన్​​ రెడ్డి మామ (భార్య తండ్రి) పరమేశ్వర రెడ్డిని బెదిరించిన నలుగురిని.. ఏపీ కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అంబర్​పేటకు చెందిన మహమ్మద్ నజీర్, లంగర్​హౌస్​కు చెందిన గంగ అలియాస్ సంగీత రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవుకు చెందిన పెంకే శ్రీమన్నారాయణమూర్తి, పెంకే లక్ష్మీ కలిసి.. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు కాకనూరు గ్రామంలో నివాసముంటున్న పరమేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లి బెదిరించారు.

గాలి జనార్దన్ రెడ్డి భార్య 28 సంవత్సరాల కిందట కవల ఆడ పిల్లలను ప్రసవించిందని వారిలో గంగ అలియాస్ సంగీతా రెడ్డి ఒకరని చిత్రాలు చూపించారు. మనవరాలుగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. పుట్టిన వెంటనే కవలల్లో ఒకరిని ఆస్పత్రి నర్సు ఎత్తుకెళ్లి తర్వాత ఇచ్చినట్లు కథ రచించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో చెప్పి పరువు మర్యాదలకు భంగం కలిగిస్తామని బెదిరించారు. రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనుమానాస్పదంగా ఉన్న వీరి తీరుపై పరమేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరిపి నలుగురిని అరెస్టు చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. మహమ్మద్ నజీర్, గంగ అలియాస్ సంగీత రెడ్డి భార్య భర్తలు. వారి ఇంట్లో పని మనుషులుగా శ్రీమన్నారాయణ మూర్తి, లక్ష్మీ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో గాలి జనార్దన్​​ రెడ్డి వివరాలు సేకరించారు. గాలి జనార్దన్ రెడ్డి మామ పరమేశ్వర రెడ్డి.. బండి ఆత్మకూరు మండలం కాకనూరు గ్రామంలో ఉంటారని తెలుసుకుని ఇలా చేశారని పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: కేశినేని నాని తమ్ముడినంటూ మోసం..డబ్బు వసూలు చేసి పరారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.