ETV Bharat / jagte-raho

జయరాం కేసు ఛార్జి​షీట్​లో ముగ్గురు పోలీసు అధికారుల పేర్లు

చిగురుపాటి జయరాం హత్య కేసులో ఏప్రిల్ నెలలోనే ఛార్జిషీట్ దాఖలైంది. 23 పేజీలో అభియోగపత్రంలో 12 మంది నిందితులను, 73 మంది సాక్షుల పేర్లను చేర్చారు. అందులో కొందరు పోలీసు అధికారుల పేర్లూ ఉన్నాయి.

author img

By

Published : Jun 10, 2019, 3:05 PM IST

Updated : Jun 10, 2019, 5:21 PM IST

jayaram-case
జయరాం కేసులో 23 పేజీల ఛార్జిషీట్​

ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జి​షీట్ వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పోలీస్‌ అధికారులను నిందితులుగా పేర్కొంటూ... అభియోగపత్రంలో పొందుపరచటం ఈ కేసులో సంచలనంగా మారింది. హనీట్రాప్ ద్వారా జయరాంను రప్పించి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన రాకేశ్ రెడ్డి, ఆపై మృతదేహాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించాడని 23 పేజీల ఛార్జిషీట్​లో పేర్కొన్నారు. 12 మంది నిందితులను, 73 మంది సాక్షుల పేర్లను చేర్చారు.

ఈ కేసులో నిందితులుగా రాకేశ్​ రెడ్డి, విశాల్, వాచ్​మెన్ శ్రీనివాస్, రౌడీషీటర్ నగేశ్, నటుడు, కమెడియన్ సూర్యప్రసాద్, ఆయన స్నేహితుడు కిశోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి, తెదేపా నేత బీఎన్ రెడ్డి, వ్యాపారి అంజిరెడ్డి, నల్లకుంట మాజీ ఇన్​స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్​స్పెక్టర్ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిలను పేర్కొన్నారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని 11వ సాక్షిగా చేర్చారు.

ఇదీ చూడండి: వాళ్లు చెప్పితే చేసేస్తారా: ఉత్తమ్

జయరాం కేసులో 23 పేజీల ఛార్జిషీట్​

ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జి​షీట్ వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పోలీస్‌ అధికారులను నిందితులుగా పేర్కొంటూ... అభియోగపత్రంలో పొందుపరచటం ఈ కేసులో సంచలనంగా మారింది. హనీట్రాప్ ద్వారా జయరాంను రప్పించి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన రాకేశ్ రెడ్డి, ఆపై మృతదేహాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించాడని 23 పేజీల ఛార్జిషీట్​లో పేర్కొన్నారు. 12 మంది నిందితులను, 73 మంది సాక్షుల పేర్లను చేర్చారు.

ఈ కేసులో నిందితులుగా రాకేశ్​ రెడ్డి, విశాల్, వాచ్​మెన్ శ్రీనివాస్, రౌడీషీటర్ నగేశ్, నటుడు, కమెడియన్ సూర్యప్రసాద్, ఆయన స్నేహితుడు కిశోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి, తెదేపా నేత బీఎన్ రెడ్డి, వ్యాపారి అంజిరెడ్డి, నల్లకుంట మాజీ ఇన్​స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్​స్పెక్టర్ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిలను పేర్కొన్నారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని 11వ సాక్షిగా చేర్చారు.

ఇదీ చూడండి: వాళ్లు చెప్పితే చేసేస్తారా: ఉత్తమ్

Intro:Body:Conclusion:
Last Updated : Jun 10, 2019, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.