ETV Bharat / jagte-raho

చైనా రుణయాప్​లో కేసులో దర్యాప్తు ముమ్మరం

author img

By

Published : Jan 15, 2021, 3:16 PM IST

రుణ యాప్​ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే 17మందిని అరెస్ట్ చేశారు. లాంబో అనే చైనా వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని... వివరాలు సేకరిస్తున్నారు.

hyderabad-cyber-crime-police-investigation-on-loan-app-case
రుణ యాప్​ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు!

డిజిటల్ సూక్ష్మ రుణ సంస్థల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 17మందిని అరెస్ట్ చేసిన పోలీసులు... వారిని కస్టడీలోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. లాంబో అనే చైనా వ్యక్తి రుణ యాప్​లను రూపొందించడంతో పాటు... వాటి ద్వారా రుణాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతనిని ఒక రోజు కస్టడీలోకి తీసుకొని... కొంత సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

లాంబో చరవాణి, లాప్​టాప్, ఐ పాడ్​లను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వాటిని విశ్లేషిస్తున్నారు. లాంబో పంపిన సందేశాలు, అతనికి వచ్చిన సందేశాలన్నీ చైనా భాషలోనే ఉండడం వల్ల... ఆ భాష తెలిసిన వాళ్ల సాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లాంబో తన లాప్​టాప్ నుంచి కీలక సమాచారం తొలగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కంప్యూటర్ నిపుణుల సాయంతో లాప్​టాప్​లోని మొత్తం సమాచారం పరిశీలిస్తున్నారు. బెంగళూర్​లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

రాజేంద్రనగర్, జగిత్యాలలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు... ఈ రుణ యాప్​ల నుంచి అప్పు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బెంగళూర్ కాల్ సెంటర్ నిర్వాహకులపై రెండు కేసులను సైబర్ క్రైం పోలీసులు నమోదు చేశారు. ఒక కేసులో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు... మరో కేసులో పీటీ వారెంట్​పై అదుపులోకి తీసుకొని, న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కస్టడీ కోరే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: చలిమంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం

డిజిటల్ సూక్ష్మ రుణ సంస్థల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 17మందిని అరెస్ట్ చేసిన పోలీసులు... వారిని కస్టడీలోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. లాంబో అనే చైనా వ్యక్తి రుణ యాప్​లను రూపొందించడంతో పాటు... వాటి ద్వారా రుణాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతనిని ఒక రోజు కస్టడీలోకి తీసుకొని... కొంత సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

లాంబో చరవాణి, లాప్​టాప్, ఐ పాడ్​లను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వాటిని విశ్లేషిస్తున్నారు. లాంబో పంపిన సందేశాలు, అతనికి వచ్చిన సందేశాలన్నీ చైనా భాషలోనే ఉండడం వల్ల... ఆ భాష తెలిసిన వాళ్ల సాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లాంబో తన లాప్​టాప్ నుంచి కీలక సమాచారం తొలగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కంప్యూటర్ నిపుణుల సాయంతో లాప్​టాప్​లోని మొత్తం సమాచారం పరిశీలిస్తున్నారు. బెంగళూర్​లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

రాజేంద్రనగర్, జగిత్యాలలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు... ఈ రుణ యాప్​ల నుంచి అప్పు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బెంగళూర్ కాల్ సెంటర్ నిర్వాహకులపై రెండు కేసులను సైబర్ క్రైం పోలీసులు నమోదు చేశారు. ఒక కేసులో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు... మరో కేసులో పీటీ వారెంట్​పై అదుపులోకి తీసుకొని, న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కస్టడీ కోరే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: చలిమంటలు అంటుకుని వృద్ధురాలు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.