ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో రైతు మృతి

వ్యవసాయ క్షేత్రంలో తెగిపోయిన కేబుల్​ వైర్ జాయింట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్​ షాక్​ తగిలి ఓ రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా లింగాపూర్​ శివారులో చోటుచేసుకుంది.

author img

By

Published : May 5, 2020, 4:04 PM IST

farmer died of electric shock at lingapur in kamareddy district
కామారెడ్డిలో విద్యుదాఘాతంతో రైతు మృతి

కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నిట్టు శంకర్ అనే రైతు లింగాపూర్​ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ​వ్యవసాయ బావి వద్ద కేబుల్​ వైర్ తెగిపడి ఉండటం చూసి జాయింట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరెంట్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న కుటుంబీకులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని బోరున విలపించారు. మృతునికి భార్య, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నిట్టు శంకర్ అనే రైతు లింగాపూర్​ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ​వ్యవసాయ బావి వద్ద కేబుల్​ వైర్ తెగిపడి ఉండటం చూసి జాయింట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరెంట్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న కుటుంబీకులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని బోరున విలపించారు. మృతునికి భార్య, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.