ETV Bharat / jagte-raho

సలబాత్​పూర్​ వద్ద నల్లబెల్లం పట్టివేత

కామారెడ్డి జిల్లాలోని సలబాత్​పూర్​ వద్ద నల్లబెల్లాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్​ నుంచి మహబూబ్​నగర్​కు దీనిని తరలిస్తున్నట్లు వెల్లడించారు. లారీలో తరలిస్తున్న 333 నల్లబెల్లం బస్తాలను సీజ్ చేశారు.

author img

By

Published : Nov 28, 2020, 9:59 AM IST

excise police seized  black jaggery in kamareddy
సలబాత్​పూర్​ వద్ద నల్లబెల్లం పట్టివేత

కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం సలబాత్​పూర్ వద్ద నల్లబెల్లాన్ని ఎక్సైజ్ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి తెలంగాణలోని మహబూబ్ నగర్​కు తరలిస్తున్న బెల్లాన్ని అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద సీజ్ చేసినట్ల ఎక్సైజ్ సీఐ లక్ష్మీ వెల్లడించారు.

లారీలో తరలిస్తున్న 333 బస్తాల నల్లబెల్లం పట్టుబడినట్లు ఆమె పేర్కొన్నారు. సుమారుగా 9.9 క్వింటాళ్ల వరకు ఉంటుందని... దాని విలువ రూ.3.50 లక్షలు ఉండవచ్చని సీఐ అంచనా వేశారు. నిందితులను బిచ్కుంద స్టేషన్​కు తరలించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సైలు నాగరాజు, జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం సలబాత్​పూర్ వద్ద నల్లబెల్లాన్ని ఎక్సైజ్ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి తెలంగాణలోని మహబూబ్ నగర్​కు తరలిస్తున్న బెల్లాన్ని అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద సీజ్ చేసినట్ల ఎక్సైజ్ సీఐ లక్ష్మీ వెల్లడించారు.

లారీలో తరలిస్తున్న 333 బస్తాల నల్లబెల్లం పట్టుబడినట్లు ఆమె పేర్కొన్నారు. సుమారుగా 9.9 క్వింటాళ్ల వరకు ఉంటుందని... దాని విలువ రూ.3.50 లక్షలు ఉండవచ్చని సీఐ అంచనా వేశారు. నిందితులను బిచ్కుంద స్టేషన్​కు తరలించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్సైలు నాగరాజు, జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: దారుణం: భర్తపై అనుమానంతో భార్య యాసిడ్‌ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.