ETV Bharat / jagte-raho

'వారి కోసం రంగంలోకి దిగిన మూడు విభాగాలు' - crores rupees hawala to china by online betting gang

ఆన్​లైన్​ జూదానికి పాల్పడి కోట్ల రూపాయలను హవాలా చేస్తున్న నలుగురు నిందితుల్ని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అధిక మొత్తంలో నగదు హవాలా కావడం వల్ల ఈడీ, ఐటీ అధికారులు కూడా నిందితులను ప్రశ్నిస్తున్నారు.

crores rupees hawala to china from Hyderabad by online betting gang
ఆన్​లైన్ బెట్టింగ్​ కేసులో కస్టడీలోకి నలుగురు నిందితులు
author img

By

Published : Aug 24, 2020, 7:12 PM IST

ఆన్​లైన్​ బెట్టింగ్​కు పాల్పడిన కేసులో నలుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైనాకు చెందిన యాన్ హోవ్​తో పాటు దిల్లీకి చెందిన ధీరజ్, అంకిత్, నీరజ్​లను పోలీసులు చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించడం వల్ల వీలైనంత సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హవాలా మార్గం ద్వారా చైనాకు డబ్బులు తరలించినట్లు తేలగా.. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దాదాపు 1,100 కోట్ల రూపాయల డబ్బు హవాలా కావడం వల్ల ఆదాయపన్ను శాఖ దీనిపై దృష్టి సారించింది. నిందితులను సీసీఎస్ పోలీసులతో పాటు ఈడీ, ఐటీ అధికారులూ ప్రశ్నిస్తున్నారు. ఏయే కంపెనీల ద్వారా డబ్బులు తరలించారనే సమాచారం సేకరిస్తున్నారు. బినామీ ఈ-కామర్స్ కంపెనీలు స్థాపించి అన్​లైన్ జూదం నిర్వహించిన నిందితులు.. ఇంకా ఏయే తరహాలో మోసాలకు పాల్పడ్డారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్​లైన్​ బెట్టింగ్​కు పాల్పడిన కేసులో నలుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైనాకు చెందిన యాన్ హోవ్​తో పాటు దిల్లీకి చెందిన ధీరజ్, అంకిత్, నీరజ్​లను పోలీసులు చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించడం వల్ల వీలైనంత సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హవాలా మార్గం ద్వారా చైనాకు డబ్బులు తరలించినట్లు తేలగా.. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దాదాపు 1,100 కోట్ల రూపాయల డబ్బు హవాలా కావడం వల్ల ఆదాయపన్ను శాఖ దీనిపై దృష్టి సారించింది. నిందితులను సీసీఎస్ పోలీసులతో పాటు ఈడీ, ఐటీ అధికారులూ ప్రశ్నిస్తున్నారు. ఏయే కంపెనీల ద్వారా డబ్బులు తరలించారనే సమాచారం సేకరిస్తున్నారు. బినామీ ఈ-కామర్స్ కంపెనీలు స్థాపించి అన్​లైన్ జూదం నిర్వహించిన నిందితులు.. ఇంకా ఏయే తరహాలో మోసాలకు పాల్పడ్డారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : అనుమానం వచ్చి జాగ్రత్తపడ్డాడు.. సైబర్​ వల నుంచి బయటపడ్డాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.