సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఫించన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మహేందర్ తెలిపారు. నెల రోజుల క్రితం హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన సంఘ మల్లయ్య అనే వృద్ధుడికి రూ.3,500 ఫించన్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని దండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి నమ్మించాడు.
అందుకు నాలుగు వేలు ఖర్చు అవుతాయని చెప్పి రూ.2000లు తీసుకెళ్లాడు. శ్రీనివాస్ తిరిగి రాకపోవటంతో బాధితుడు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీధర్ సిబ్బందితో కలిసి నిందితుడు శ్రీనివాస్ను పట్టుకున్నారు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్