ETV Bharat / jagte-raho

వాగులో కొట్టుకుపోయిన కారు...తండ్రీ కుమార్తె గల్లంతు

author img

By

Published : Oct 23, 2020, 12:07 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారి వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో తండ్రీ, కుమార్తె గల్లంతు కాగా... మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.

car washed away in flood water
వాగులో కొట్టుకుపోయిన కారు...తండ్రీ కుమార్తె గల్లంతు

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో కొండయ్యగారి వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా... మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండయ్యగారి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిత్తూరు పట్టణానికి చెందిన ప్రతాప్.. భార్య శ్యామల, కుమార్తె సాయి వినీత, మరో బంధువుతో కలిసి.. కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని తమ సమీప బంధువు వివాహానికి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు.

వాగులో కొట్టుకుపోయిన కారు...తండ్రీ కుమార్తె గల్లంతు

రాత్రి 12 గంటల సమయంలో కొండయ్యగారి వాగు దాటేందుకు యత్నించగా... వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆగడంతో డ్రైవర్​ కిరణ్​ అద్దాలు పగులగొట్టి ఒక్కొక్కరినిని బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సాయి వినీత నీటిలో కొట్టుకు పోతుండడంతో.. కాపాడేందుకు తండ్రి ప్రతాప్​ ప్రయత్నించాడు. నీటి ప్రవాహానికి ఇద్దరు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.

ఇదీ చదవండి: వాహనం ఢీకొని రెండేళ్ల కుమారుడితో పాటు తల్లి మృతి

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో కొండయ్యగారి వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా... మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండయ్యగారి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిత్తూరు పట్టణానికి చెందిన ప్రతాప్.. భార్య శ్యామల, కుమార్తె సాయి వినీత, మరో బంధువుతో కలిసి.. కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని తమ సమీప బంధువు వివాహానికి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు.

వాగులో కొట్టుకుపోయిన కారు...తండ్రీ కుమార్తె గల్లంతు

రాత్రి 12 గంటల సమయంలో కొండయ్యగారి వాగు దాటేందుకు యత్నించగా... వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆగడంతో డ్రైవర్​ కిరణ్​ అద్దాలు పగులగొట్టి ఒక్కొక్కరినిని బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సాయి వినీత నీటిలో కొట్టుకు పోతుండడంతో.. కాపాడేందుకు తండ్రి ప్రతాప్​ ప్రయత్నించాడు. నీటి ప్రవాహానికి ఇద్దరు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.

ఇదీ చదవండి: వాహనం ఢీకొని రెండేళ్ల కుమారుడితో పాటు తల్లి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.