కారులో మంటలు... ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు
By
Published : Aug 31, 2020, 2:30 PM IST
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ గోపాలపట్నం వద్ద కుమారి కల్యాణ మండపం సమీపంలో ప్రధాన రహదారిపై కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన ప్రయాణికులు నలుగురు దూరంగా పారిపోయారు. కారు చూస్తుండగానే కాలిపోయింది. ప్రయాణికులకు ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.