ETV Bharat / jagte-raho

శ్మశానవాటికలో శిశువు మృతదేహం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహాన్ని... స్థానికులు శ్మశానవాటికలో గుర్తించిన ఘటన కాశీబుగ్గలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని... శిశువు చేతికి ఉన్న ట్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

author img

By

Published : Sep 23, 2020, 1:01 PM IST

baby-boy-dead-body-found-in-graveyard-at-kasibugga-in-warangal-urban-district
శ్మశానవాటికలో శిశువు మృతదేహం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

వరంగల్ అర్బన్​ జిల్లా కాశీబుగ్గలోని ఎస్సీ శ్మశానవాటిక వద్ద అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా... ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

శిశువు కుడిచేతికి తల్లిదండ్రులు సునీత, శంకర్​ల పేర్లతో కూడిన ట్యాగ్​ను పోలీసులు గుర్తించారు. శిశువుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఏదైనా అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శ్మశానవాటికలో పడవేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్ అర్బన్​ జిల్లా కాశీబుగ్గలోని ఎస్సీ శ్మశానవాటిక వద్ద అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా... ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

శిశువు కుడిచేతికి తల్లిదండ్రులు సునీత, శంకర్​ల పేర్లతో కూడిన ట్యాగ్​ను పోలీసులు గుర్తించారు. శిశువుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఏదైనా అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శ్మశానవాటికలో పడవేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఊర్లో గొడవకి.. తండ్రి చేతిలో కొడుకు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.