ETV Bharat / jagte-raho

ఆటోను ఢీకొట్టిన కారు... ఆరుగురికి గాయాలు, ఓ వ్యక్తి మృతి - auto car collision

మెదక్ జిల్లా రామాయంపేటలో ఎన్​హెచ్​-44పై ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం వల్ల హైదరాబాద్​కు తరలించారు. ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

auto car collision one person died in medak district
ఆటోను ఢీకొట్టిన కారు... ఆరుగురికి గాయాలు, ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Oct 13, 2020, 10:41 AM IST

మెదక్ జిల్లా రామాయంపేటలో జాతీయ రహదారి-44పై ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆటోలోని నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ఆస్పత్రికి తరలించారు. చేగుంట మండలం నార్సింగికి చెంది వెంకటేశ్​ హైదరాబాద్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

నిజాంపేట మండలం నందిగామలో నలుగురు వ్యక్తులు బ్లాంకెట్స్‌ అమ్ముకొని తిరిగి రామాయంపేటకు ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురికి తీవ్రగాయాలు కాగా... కారులో ఉన్న ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనపై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మెదక్ జిల్లా రామాయంపేటలో జాతీయ రహదారి-44పై ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆటోలోని నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ఆస్పత్రికి తరలించారు. చేగుంట మండలం నార్సింగికి చెంది వెంకటేశ్​ హైదరాబాద్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

నిజాంపేట మండలం నందిగామలో నలుగురు వ్యక్తులు బ్లాంకెట్స్‌ అమ్ముకొని తిరిగి రామాయంపేటకు ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురికి తీవ్రగాయాలు కాగా... కారులో ఉన్న ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనపై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: తల యంత్రంలో ఇరుక్కుని కార్మికుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.