వనపర్తి జిల్లా మదనాపురం మండలం స్కూల్తండాకు చెందిన శివ(25), పార్వతి(30)... వరుసకు అత్త, అల్లుడు అవుతారు. దుప్పల్లి సమీపంలో కొన్నూర్కు వెళ్లేదారిలో ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తండ్రికి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పినట్లు విచారణలో తేలింది. ఆత్మహత్యలై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు