ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో వృద్దురాలు మృతి

author img

By

Published : Dec 27, 2020, 3:02 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీస్‌ స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

An old woman dies in a road accident  in nagarkurnool
రోడ్డు ప్రమాదంలో వృద్దురాలు మృతి

పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భాగ్యమ్మ అనే వృద్ధురాలు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగింది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో రోడ్డు దాటుతున్న వృద్ధురాలుని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

పట్టణ కేంద్రంలోని రాంనగర్ కాలనీలో భాగ్యమ్మ అనే వృద్ధురాలు కొద్ది కాలంగా నివాసం ఉంటోంది. ఈ రోజు ఆమె అక్కడి పోలీసు స్టేషన్‌ సమీపంలో రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భాగ్యమ్మ అనే వృద్ధురాలు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగింది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో రోడ్డు దాటుతున్న వృద్ధురాలుని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

పట్టణ కేంద్రంలోని రాంనగర్ కాలనీలో భాగ్యమ్మ అనే వృద్ధురాలు కొద్ది కాలంగా నివాసం ఉంటోంది. ఈ రోజు ఆమె అక్కడి పోలీసు స్టేషన్‌ సమీపంలో రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: పిల్లల అమ్మకాలకు ఏజెంట్​ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.