ETV Bharat / jagte-raho

బలవన్మరణం: ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి

author img

By

Published : Dec 27, 2020, 10:06 AM IST

Updated : Dec 27, 2020, 12:22 PM IST

A mother who jumped into a pond with her two children
ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి

10:04 December 27

బలవన్మరణం: ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి

మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి సమయంలో నాగమణి అనే  వివాహిత  తన 5 సంవత్సరాల  పెద్ద కుమార్తె మార్వెల్ రూబీ, 8 నెలల చిన్న కుమార్తెతో సహా చెన్నపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.  

క్రిస్మస్ పండుగకు పుట్టింటికి వెళ్తానంటే పండుగ అయిపోయిన తర్వాత వెళ్లమని భర్త చెప్పటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇదే విషయమై నిన్న రాత్రి వారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. ఇదే విషయమై భర్త.. జవహర్​నగర్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్​ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో చెన్నపురం చెరువులో మృతదేహాలు కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. వారిని నాగమణి, ఆమె ఇద్దరు పిల్లలుగా గుర్తించారు.  

ఇదీ చదవండి: మాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతాతో సొమ్ము కాజేసిన కిలేడి

10:04 December 27

బలవన్మరణం: ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి

మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి సమయంలో నాగమణి అనే  వివాహిత  తన 5 సంవత్సరాల  పెద్ద కుమార్తె మార్వెల్ రూబీ, 8 నెలల చిన్న కుమార్తెతో సహా చెన్నపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.  

క్రిస్మస్ పండుగకు పుట్టింటికి వెళ్తానంటే పండుగ అయిపోయిన తర్వాత వెళ్లమని భర్త చెప్పటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇదే విషయమై నిన్న రాత్రి వారి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. ఇదే విషయమై భర్త.. జవహర్​నగర్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్​ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో చెన్నపురం చెరువులో మృతదేహాలు కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. వారిని నాగమణి, ఆమె ఇద్దరు పిల్లలుగా గుర్తించారు.  

ఇదీ చదవండి: మాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతాతో సొమ్ము కాజేసిన కిలేడి

Last Updated : Dec 27, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.