ETV Bharat / jagte-raho

ఐపీఎల్ బుకీల గుట్టు రట్టు.. 8 స్థావరాల్లో 13 మంది అరెస్ట్

author img

By

Published : Oct 7, 2020, 6:50 PM IST

ఆన్​లైన్​ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మంది క్రికెట్ బుకీలతో పాటు సహాయకులుగా పని చేస్తున్న మరో 13 మంది కడప పోలీసులకు చిక్కారు. వారి నుంచి నగదు, గంజాయి, చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

13-ipl-cricket-bookies-arrested-and-attacked-on-8-bases-says-kadapa-sp
ఐపీఎల్ బుకీల గుట్టు రట్టు.. 8 స్థావరాల్లో 13 మంది అరెస్ట్

ఏపీలోని కడప జిల్లాలో ఆన్​లైన్​ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మంది క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సహాయకులుగా పనిచేస్తున్న వారితో కలిపి మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 8.35 లక్షల నగదు, 20 కేజీల గంజాయి, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన క్రికెట్ బుకీ హైదరాబాద్​కు చెందిన షేక్ మహమ్మద్ ఇమ్రాన్ ఉన్నారు.

జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్..

క్రికెట్ బుకీలందరినీ కడప ఎస్పీ అన్బురాజన్ జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. జిల్లా వ్యాప్తంగా ఆన్​లైన్​ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. రాయచోటి, ప్రొద్దుటూరు, కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు చేశామన్నారు.

హవాలా ద్వారా..

ఈ ఎనిమిది మంది బుకీల బ్యాంకు ఖాతాలను పరిశీలించగా రూ.60 లక్షల నగదు... హవాలా ద్వారా పంపిణీ చేసినట్లు తెలిసిందని చెప్పారు. డైమండ్ ఎక్స్చేంజ్​ ఆన్​లైన్​ యాప్ ద్వారా బుకీలు క్రికెట్ బెట్టింగ్ నగదు బదిలీ చేసేవారని వివరించారు. ఈ యాప్ ద్వారా దేశమంతటా బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

ఇవీ చూడండి: పేకాట స్థావరంపై పోలీసుల దాడి... 18 మంది అరెస్టు

ఏపీలోని కడప జిల్లాలో ఆన్​లైన్​ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మంది క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సహాయకులుగా పనిచేస్తున్న వారితో కలిపి మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 8.35 లక్షల నగదు, 20 కేజీల గంజాయి, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన క్రికెట్ బుకీ హైదరాబాద్​కు చెందిన షేక్ మహమ్మద్ ఇమ్రాన్ ఉన్నారు.

జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్..

క్రికెట్ బుకీలందరినీ కడప ఎస్పీ అన్బురాజన్ జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. జిల్లా వ్యాప్తంగా ఆన్​లైన్​ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. రాయచోటి, ప్రొద్దుటూరు, కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు చేశామన్నారు.

హవాలా ద్వారా..

ఈ ఎనిమిది మంది బుకీల బ్యాంకు ఖాతాలను పరిశీలించగా రూ.60 లక్షల నగదు... హవాలా ద్వారా పంపిణీ చేసినట్లు తెలిసిందని చెప్పారు. డైమండ్ ఎక్స్చేంజ్​ ఆన్​లైన్​ యాప్ ద్వారా బుకీలు క్రికెట్ బెట్టింగ్ నగదు బదిలీ చేసేవారని వివరించారు. ఈ యాప్ ద్వారా దేశమంతటా బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

ఇవీ చూడండి: పేకాట స్థావరంపై పోలీసుల దాడి... 18 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.