ETV Bharat / international

మంచు చరియలు విరిగిపడి 12 మంది మృతి

ఇరాన్​లోని అల్​బోర్స్​ పర్వత శ్రేణుల్లో శుక్రవారం దుర్ఘటన జరిగింది. ఉత్తర టెహ్రాన్​లోని ఈ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడి 12మంది మృతిచెందారు.

author img

By

Published : Dec 28, 2020, 9:33 AM IST

Avalanches kill 12 in mountainous area near Iran's capital
ఇరాన్​లో ప్రమాదం - 12 మంది మృతి

ఇరాన్​ రాజధాని టెహ్రాన్​లో మంచు చరియలు విరిగిపడి 12 మంది మృతిచెందారు. ఉత్తర టెహ్రాన్​లోని అల్​బోర్స్​ పర్వత శ్రేణుల్లో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులు, హిమపాతమే ఇందుకు కారణం. గల్లంతైన వారిలో 14 మందిని సహాయక బృందం శనివారం కనుగొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

పెడచెవిన పెట్టారు..

ఆచూకీ లభ్యమైన వారిలో 11 మంది అప్పటికే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారని స్థానిక మీడియా తెలిపింది. బలమైన గాలులపై వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను చాలా మంది పెడచెవిన పెట్టారని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'త్వరలో అందరికీ సరిపడా టీకాలు'

ఇరాన్​ రాజధాని టెహ్రాన్​లో మంచు చరియలు విరిగిపడి 12 మంది మృతిచెందారు. ఉత్తర టెహ్రాన్​లోని అల్​బోర్స్​ పర్వత శ్రేణుల్లో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. బలమైన గాలులు, హిమపాతమే ఇందుకు కారణం. గల్లంతైన వారిలో 14 మందిని సహాయక బృందం శనివారం కనుగొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

పెడచెవిన పెట్టారు..

ఆచూకీ లభ్యమైన వారిలో 11 మంది అప్పటికే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారని స్థానిక మీడియా తెలిపింది. బలమైన గాలులపై వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను చాలా మంది పెడచెవిన పెట్టారని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'త్వరలో అందరికీ సరిపడా టీకాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.