ETV Bharat / international

ఉగ్రదాడిలో 28 మంది మృతి

సిరియాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఓ ప్రయాణికుల బస్సుపై దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు 28 మందిని పొట్టనబెట్టుకున్నారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : Dec 31, 2020, 12:59 AM IST

Terrorist attack in Syria kills 28
సిరియా ఉగ్రదాడిలో 28 మంది మృతి

సిరియాలో ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్నా ఓ బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ 'సన' వెల్లడించింది.

ప్రయాణికులతో కూడిన బస్సు బుధవారం దక్షిణ సిరియాలోని సెంట్రల్​ హోమ్స్​ రాష్ట్రం నుంచి డిర్​ అజ్​ జోర్​ నగరానికి వెళ్తుండగా ఉగ్రదాడి జరిగినట్లు తెలిపింది. ఇందులో పలువురుకి గాయాలైనట్లు వివరించింది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉందని పేర్కొంది.

దాడి జరిగిన ప్రాంతం ఒకప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదుల అధీనంలో ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం చేజిక్కించుకున్నా.. ఉగ్రవాదులు క్రియాశీలంగానే ఉన్నారు.

ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

సిరియాలో ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్నా ఓ బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ 'సన' వెల్లడించింది.

ప్రయాణికులతో కూడిన బస్సు బుధవారం దక్షిణ సిరియాలోని సెంట్రల్​ హోమ్స్​ రాష్ట్రం నుంచి డిర్​ అజ్​ జోర్​ నగరానికి వెళ్తుండగా ఉగ్రదాడి జరిగినట్లు తెలిపింది. ఇందులో పలువురుకి గాయాలైనట్లు వివరించింది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉందని పేర్కొంది.

దాడి జరిగిన ప్రాంతం ఒకప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదుల అధీనంలో ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం చేజిక్కించుకున్నా.. ఉగ్రవాదులు క్రియాశీలంగానే ఉన్నారు.

ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.