ETV Bharat / international

సిరియాలో వైమానిక దాడి.. 33 మంది టర్కీ జవాన్లు మృతి - సిరియాలో వైమానిక దాడి

సిరియాలోని ఇడ్లిబ్​ నగరంపై మరోమారు బాంబుల వర్షం కురిసింది. గురువారం జరిగిన వైమానిక దాడిలో 33 మంది టర్కీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. టర్కీకి సరిహద్దులో ఈ ఘటన జరగటం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Turkish soldiers killed in govt offensive as tensions mount in Syria
సిరియాలో వైమానిక దాడి.
author img

By

Published : Feb 28, 2020, 10:43 AM IST

Updated : Mar 2, 2020, 8:21 PM IST

సిరియాలో జరిగిన వైమానిక దాడిలో 33 మంది టర్కీ సైనికులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం టర్కీకి తరలించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. టర్కీ సరిహద్దుల్లోని సిరియా వాయవ్య నగరం ఇడ్లిబ్‌లో ఈ దాడి జరిగింది.

అధ్యక్షుడి అత్యవసర భేటీ..

టర్కీ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు, సిరియా మధ్య పోరు తీవ్రంగా జరుగుతున్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ దాడి తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్‌ అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అయితే టర్కీ సైన్యం ఎదురుదాడులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇడ్లిబ్‌ నగరంలోని తమ పరిశీలన కేంద్రాల నుంచి తప్పుకోవాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్‌ సిరియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఖండించిన నాటో

మరోవైపు ఈ దాడిని నాటో తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతల నివారణతోపాటు, పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు సహకరించాలని అన్నిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నాటో అధికార ప్రతినిధి ఓ ప్రకటన జారీ చేశారు.

ఇదీ చూడండి: సూచీలు ఢమాల్​.. 1100 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్​

సిరియాలో జరిగిన వైమానిక దాడిలో 33 మంది టర్కీ సైనికులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం టర్కీకి తరలించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. టర్కీ సరిహద్దుల్లోని సిరియా వాయవ్య నగరం ఇడ్లిబ్‌లో ఈ దాడి జరిగింది.

అధ్యక్షుడి అత్యవసర భేటీ..

టర్కీ మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు, సిరియా మధ్య పోరు తీవ్రంగా జరుగుతున్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ దాడి తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్‌ అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అయితే టర్కీ సైన్యం ఎదురుదాడులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇడ్లిబ్‌ నగరంలోని తమ పరిశీలన కేంద్రాల నుంచి తప్పుకోవాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్‌ సిరియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఖండించిన నాటో

మరోవైపు ఈ దాడిని నాటో తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతల నివారణతోపాటు, పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు సహకరించాలని అన్నిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నాటో అధికార ప్రతినిధి ఓ ప్రకటన జారీ చేశారు.

ఇదీ చూడండి: సూచీలు ఢమాల్​.. 1100 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్​

Last Updated : Mar 2, 2020, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.