ETV Bharat / international

ఉక్రెయిన్​ ఆక్రమిత ప్రాంతాల విలీనానికి 'మాస్కో' స్కెచ్​!

author img

By

Published : May 3, 2022, 1:38 PM IST

Ukraine Crisis: ఉక్రెయిన్​పై భీకర యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ కీలక అడుగు వేసేందుకు పావులు కదుపుతున్నారు. రష్యా సేనలు ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ దేశంలో శాశ్వత భాగాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్​ సోమవారం హెచ్చరించింది.

Ukraine Crisis
Ukraine Crisis

Ukraine Crisis: రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో మరో కీలక అడుగు వేసేందుకు పావులు కదుపుతున్నారు. తన ఉక్కుపిడికిలిలో బంధించిన ప్రాంతాలను రష్యాలో శాశ్వత భాగాలుగా మార్చేసేందుకు యత్నాలు చేస్తున్నట్లు పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఉక్రెయిన్‌ తూర్పుభాగంపై తన పట్టును బిగించేందుకే ఈ ప్రయత్నాలని అమెరికా ఇంటెలిజెన్స్‌ సోమవారం హెచ్చరించింది. ఖెర్సాన్‌ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పోరాటం జరుగుతున్నా.. రష్యా ఈ ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఈ మేరకు తమకు నమ్మకమైన సమాచారం అందిందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. 2014లో క్రిమియాను ఆక్రమించుకొన్న తర్వాత కూడా రష్యా ఇదే వ్యూహాన్ని అనుసరించింది.

అమెరికా నిఘా సంస్థలు ఏం చెబుతున్నాయి: అమెరికా సంస్థల కథనం ప్రకారం.. రష్యా మే నెల మధ్యలో డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ లేదా ఖెర్సాన్‌ ప్రాంతాల్లో ఓ రెఫరెండం (ప్రజాభిప్రాయసేకరణ) చేపట్టనుంది. ఉక్రెయిన్‌ను వీడి రష్యాతో కలిసేందుకు అక్కడి ప్రజల మద్దతు ఉందని చెప్పేందుకే ఈ చర్యలు చేపట్టనుంది. దీంతోపాటు తనకు నమ్మకమైన వ్యక్తులను అక్కడి పాలకులుగా పుతిన్‌ నియమించే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి ఈ ఓటింగ్‌ అనేది ఓ ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం విలీనం చేసుకొన్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి వ్యూహాలను రష్యా అనుసరించడం కొత్తేమీ కాదని అమెరికా ఆర్గనైజేషన్‌ ఫర్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ప్రతినిధి మిషెల్‌ కార్పెంటర్‌ వెల్లడించారు. ఇప్పటికే రష్యా ఆక్రమణ విషయంలో అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాల అంచనాలు తప్పలేదని ఆయన పేర్కొన్నారు. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో కనుక రెఫరెండం నిర్వహిస్తే చర్చలకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయినట్లేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవలే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సమస్య మరింత చిక్కుముడులు పడే అవకాశం ఉంది.

గతాన్ని గమనిస్తే..?: ఉక్రెయిన్‌పై ఆక్రమణ ప్రకటించిన ఫిబ్రవరి 24కు రెండు రోజుల ముందు డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలను కీవ్‌ నుంచి విడిపోయిన స్వతంత్ర భాగాలుగా మాస్కో గుర్తించింది. ఆ తర్వాత అక్కడ శాంతి నెలకొల్పేందుకంటూ పీస్‌ కీపింగ్‌ దళాలను పంపింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రకటించింది. మరోపక్క ఖెర్సాన్‌ పట్టణాన్ని ఆక్రమించిన తర్వాత రష్యా అక్కడ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి యత్నాలు చేసింది. ఉక్రెయిన్‌ కరెన్సీని నిలిపి రూబుల్స్‌ చలామణి చేయడానికి యత్నాలు మొదలుపెట్టింది. దీనిపై 'ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌' సభ్యుడు డెనియల్‌ ఫ్రెడ్‌ మాట్లాడుతూ రెఫరెండం వంటి చర్యలను ఐరోపా దేశాలు యుద్ధానికి ముగింపుగా భావించి సహిస్తాయని పుతిన్‌ అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, బుచాలో నరమేధం వంటివి చూశాక పుతిన్‌ ఆక్రమణను పశ్చిమదేశాలు అంగీకరించవని పేర్కొన్నారు.

నాలుగోవంతు దళాలు దెబ్బతిన్నాయి: యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి కీవ్‌ సహా కీలక నగరాలపై రష్యా దళాలు తీవ్రమైన దాడులు చేశాయి. కొన్ని నగరాలను ఆక్రమించాయి. కానీ, ఆతర్వాత వాటిని నిలబెట్టుకోకుండా వదిలేసి వెళ్లిపోయాయి. తాజాగా రష్యా దళాలు ఇజ్యూమ్‌ పట్టణంపై దాడులు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్‌పై దాడికి వచ్చిన దళాల్లో నాలుగో వంతు ఇప్పటికే దెబ్బతిన్నాయని బ్రిటిష్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిని పునర్‌ నిర్మించుకోవాలంటే రష్యాకు కొన్నేళ్లు పట్టొచ్చని అంచనావేసింది. పశ్చిమ దేశాల ఆయుధ ప్రవాహం ఉక్రెయిన్‌లో పెరిగిపోతోంది. మరోపక్క లాజిస్టిక్స్‌, ఇతర వైఫల్యాలతో రష్యా దళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మే9వ తేదీన విక్టరీడే నాటికి పుతిన్‌ చెప్పుకోవడానికి బలమైన విజయాలు అవసరం.

తూర్పు ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల శతఘ్నులు: తూర్పు ఉక్రెయిన్‌ను రష్యా విలీనం చేసుకోవడం అంత తేలిగ్గా జరిగేలా లేదు. అమెరికా ఇటీవల ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల సాయంలో భాగంగా ఎం777 వేరియంట్‌ శతఘ్నులను ఉక్రెయిన్‌కు అందజేస్తోంది. కెనడా కూడా ఇటువంటి వాటినే అందిస్తోంది. వీటిని యుద్ధక్షేత్రాలకు హెలికాప్టర్లు, లేదా వాహనాలకు అమర్చి లాక్కొని వెళ్లవచ్చు. ఇప్పటికే అమెరికా చెప్పిన వాటిలో సగానికిపై డెలివరీ చేసినట్లు పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కెర్బీ ప్రకటించారు. వీటితోపాటు అత్యాధునిక గైడెడ్‌ షెల్స్‌ను కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఇవి జీపీఎస్‌ ఆధారంగా నిర్దేశిత లక్ష్యాన్ని నాలుగు మీటర్లు అటు ఇటుగా ఛేదిస్తాయి. శతఘ్నులు దాడికి ముందు డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్‌ కచ్చితమైన లక్ష్యాలను గుర్తిస్తోంది. దీనికి తోడు స్థానికులు, పోరాటంలో ఉన్న దళాలు ఇచ్చే సమాచారంతో కచ్చితమైన రష్యా లక్ష్యాలపై దాడులు చేస్తోంది. దాదాపు 1,700 రష్యా వాహనాలను ఉక్రెయిన్‌ శతఘ్నులు ధ్వంసం చేసినట్లు ఫోర్బ్స్‌ కథనంలో పేర్కొంది.

ఇదీ చూడండి: మేరియుపొల్​ నుంచి తరలింపులు.. కీవ్​ను సందర్శించిన పెలోసీ

Ukraine Crisis: రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో మరో కీలక అడుగు వేసేందుకు పావులు కదుపుతున్నారు. తన ఉక్కుపిడికిలిలో బంధించిన ప్రాంతాలను రష్యాలో శాశ్వత భాగాలుగా మార్చేసేందుకు యత్నాలు చేస్తున్నట్లు పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఉక్రెయిన్‌ తూర్పుభాగంపై తన పట్టును బిగించేందుకే ఈ ప్రయత్నాలని అమెరికా ఇంటెలిజెన్స్‌ సోమవారం హెచ్చరించింది. ఖెర్సాన్‌ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పోరాటం జరుగుతున్నా.. రష్యా ఈ ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఈ మేరకు తమకు నమ్మకమైన సమాచారం అందిందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. 2014లో క్రిమియాను ఆక్రమించుకొన్న తర్వాత కూడా రష్యా ఇదే వ్యూహాన్ని అనుసరించింది.

అమెరికా నిఘా సంస్థలు ఏం చెబుతున్నాయి: అమెరికా సంస్థల కథనం ప్రకారం.. రష్యా మే నెల మధ్యలో డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ లేదా ఖెర్సాన్‌ ప్రాంతాల్లో ఓ రెఫరెండం (ప్రజాభిప్రాయసేకరణ) చేపట్టనుంది. ఉక్రెయిన్‌ను వీడి రష్యాతో కలిసేందుకు అక్కడి ప్రజల మద్దతు ఉందని చెప్పేందుకే ఈ చర్యలు చేపట్టనుంది. దీంతోపాటు తనకు నమ్మకమైన వ్యక్తులను అక్కడి పాలకులుగా పుతిన్‌ నియమించే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి ఈ ఓటింగ్‌ అనేది ఓ ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం విలీనం చేసుకొన్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి వ్యూహాలను రష్యా అనుసరించడం కొత్తేమీ కాదని అమెరికా ఆర్గనైజేషన్‌ ఫర్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ప్రతినిధి మిషెల్‌ కార్పెంటర్‌ వెల్లడించారు. ఇప్పటికే రష్యా ఆక్రమణ విషయంలో అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాల అంచనాలు తప్పలేదని ఆయన పేర్కొన్నారు. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో కనుక రెఫరెండం నిర్వహిస్తే చర్చలకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయినట్లేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవలే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సమస్య మరింత చిక్కుముడులు పడే అవకాశం ఉంది.

గతాన్ని గమనిస్తే..?: ఉక్రెయిన్‌పై ఆక్రమణ ప్రకటించిన ఫిబ్రవరి 24కు రెండు రోజుల ముందు డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలను కీవ్‌ నుంచి విడిపోయిన స్వతంత్ర భాగాలుగా మాస్కో గుర్తించింది. ఆ తర్వాత అక్కడ శాంతి నెలకొల్పేందుకంటూ పీస్‌ కీపింగ్‌ దళాలను పంపింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రకటించింది. మరోపక్క ఖెర్సాన్‌ పట్టణాన్ని ఆక్రమించిన తర్వాత రష్యా అక్కడ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి యత్నాలు చేసింది. ఉక్రెయిన్‌ కరెన్సీని నిలిపి రూబుల్స్‌ చలామణి చేయడానికి యత్నాలు మొదలుపెట్టింది. దీనిపై 'ది అట్లాంటిక్‌ కౌన్సిల్‌' సభ్యుడు డెనియల్‌ ఫ్రెడ్‌ మాట్లాడుతూ రెఫరెండం వంటి చర్యలను ఐరోపా దేశాలు యుద్ధానికి ముగింపుగా భావించి సహిస్తాయని పుతిన్‌ అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, బుచాలో నరమేధం వంటివి చూశాక పుతిన్‌ ఆక్రమణను పశ్చిమదేశాలు అంగీకరించవని పేర్కొన్నారు.

నాలుగోవంతు దళాలు దెబ్బతిన్నాయి: యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి కీవ్‌ సహా కీలక నగరాలపై రష్యా దళాలు తీవ్రమైన దాడులు చేశాయి. కొన్ని నగరాలను ఆక్రమించాయి. కానీ, ఆతర్వాత వాటిని నిలబెట్టుకోకుండా వదిలేసి వెళ్లిపోయాయి. తాజాగా రష్యా దళాలు ఇజ్యూమ్‌ పట్టణంపై దాడులు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్‌పై దాడికి వచ్చిన దళాల్లో నాలుగో వంతు ఇప్పటికే దెబ్బతిన్నాయని బ్రిటిష్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిని పునర్‌ నిర్మించుకోవాలంటే రష్యాకు కొన్నేళ్లు పట్టొచ్చని అంచనావేసింది. పశ్చిమ దేశాల ఆయుధ ప్రవాహం ఉక్రెయిన్‌లో పెరిగిపోతోంది. మరోపక్క లాజిస్టిక్స్‌, ఇతర వైఫల్యాలతో రష్యా దళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మే9వ తేదీన విక్టరీడే నాటికి పుతిన్‌ చెప్పుకోవడానికి బలమైన విజయాలు అవసరం.

తూర్పు ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల శతఘ్నులు: తూర్పు ఉక్రెయిన్‌ను రష్యా విలీనం చేసుకోవడం అంత తేలిగ్గా జరిగేలా లేదు. అమెరికా ఇటీవల ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల సాయంలో భాగంగా ఎం777 వేరియంట్‌ శతఘ్నులను ఉక్రెయిన్‌కు అందజేస్తోంది. కెనడా కూడా ఇటువంటి వాటినే అందిస్తోంది. వీటిని యుద్ధక్షేత్రాలకు హెలికాప్టర్లు, లేదా వాహనాలకు అమర్చి లాక్కొని వెళ్లవచ్చు. ఇప్పటికే అమెరికా చెప్పిన వాటిలో సగానికిపై డెలివరీ చేసినట్లు పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కెర్బీ ప్రకటించారు. వీటితోపాటు అత్యాధునిక గైడెడ్‌ షెల్స్‌ను కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఇవి జీపీఎస్‌ ఆధారంగా నిర్దేశిత లక్ష్యాన్ని నాలుగు మీటర్లు అటు ఇటుగా ఛేదిస్తాయి. శతఘ్నులు దాడికి ముందు డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్‌ కచ్చితమైన లక్ష్యాలను గుర్తిస్తోంది. దీనికి తోడు స్థానికులు, పోరాటంలో ఉన్న దళాలు ఇచ్చే సమాచారంతో కచ్చితమైన రష్యా లక్ష్యాలపై దాడులు చేస్తోంది. దాదాపు 1,700 రష్యా వాహనాలను ఉక్రెయిన్‌ శతఘ్నులు ధ్వంసం చేసినట్లు ఫోర్బ్స్‌ కథనంలో పేర్కొంది.

ఇదీ చూడండి: మేరియుపొల్​ నుంచి తరలింపులు.. కీవ్​ను సందర్శించిన పెలోసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.