ETV Bharat / international

ఫ్లైఓవర్​ పిల్లర్​ను ఢీకొని లోయలో పడ్డ బస్సు.. 42 మంది మృతి

author img

By

Published : Jan 29, 2023, 11:52 AM IST

Updated : Jan 29, 2023, 5:59 PM IST

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు యూ టర్న్​ తీసుకుంటున్న సమయంలో పిల్లర్​ను ఢీకొని లోయలో పడి మంటలు చెలరేగాయి. వాహనంలో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉండగా.. 42 మంది మృతి చెందారు.

Pakistan Balochistan Road Accident
పాకిస్థాన్​లో లోయలో పడి 42 మంది మృతి

పాకిస్థాన్​లో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో 42 మంది మరణించారు. బలూచిస్థాన్​లోని లాస్బెలా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఓ బస్సు ఫ్లైఓవర్​ పిల్లర్​ను ఢీకొని అదుపు తప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. బస్సులోని 48 మంది ప్రయాణికుల్లో 42 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారితో సహా ముగ్గురిని ప్రాణాలతో కాపాడామని.. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్​ అంజా అంజుమ్​ తెలిపారు.

బస్సు.. క్వెట్టా ప్రావిన్స్​ నుంచి రాజధాని కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లాస్బెలా సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సు యూ-టర్న్ తీసుకుంటుండగా వంతెన పిల్లర్‌ను ఢీకొని లోయలో పడి మంటలు అంటుకున్నాయని.. దీంతో 39 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని అంజా అంజుమ్​ వెల్లడించారు. ప్రమాద స్థలం నుంచి ఇప్పటి వరకు 42 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ దుర్ఘటనపై ఆ దేశ మంత్రి రాణా సనావుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Balochistan Road Accident Bus
సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు
Balochistan Road Accident
ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాలు
Balochistan Road Accident Bus
రోడ్డు ప్రమాదానికి గురైన బస్సు

పాకిస్థాన్​లో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో 42 మంది మరణించారు. బలూచిస్థాన్​లోని లాస్బెలా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఓ బస్సు ఫ్లైఓవర్​ పిల్లర్​ను ఢీకొని అదుపు తప్పి లోయలో పడింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. బస్సులోని 48 మంది ప్రయాణికుల్లో 42 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారితో సహా ముగ్గురిని ప్రాణాలతో కాపాడామని.. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్​ అంజా అంజుమ్​ తెలిపారు.

బస్సు.. క్వెట్టా ప్రావిన్స్​ నుంచి రాజధాని కరాచీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లాస్బెలా సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సు యూ-టర్న్ తీసుకుంటుండగా వంతెన పిల్లర్‌ను ఢీకొని లోయలో పడి మంటలు అంటుకున్నాయని.. దీంతో 39 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని అంజా అంజుమ్​ వెల్లడించారు. ప్రమాద స్థలం నుంచి ఇప్పటి వరకు 42 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ దుర్ఘటనపై ఆ దేశ మంత్రి రాణా సనావుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Balochistan Road Accident Bus
సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు
Balochistan Road Accident
ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాలు
Balochistan Road Accident Bus
రోడ్డు ప్రమాదానికి గురైన బస్సు
Last Updated : Jan 29, 2023, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.