ETV Bharat / international

శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్​ దాడి- 52 మంది మృతి, ప్రపంచ దేశాల ఆందోళన

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 1:56 PM IST

Updated : Nov 5, 2023, 8:01 PM IST

Israel Attack On Gaza Latest News : గాజాలో హమాస్‌ మిలిటెంట్‌ సంస్థను కూకటివేళ్లతో పెకిలించేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఇజ్రాయెల్‌ వైమానిక దళం ఆదివారం తెల్లవారుజామున గాజాలోని శరణార్థి శిబిరంపై జరిపిన దాడిలో 52 మందికి మరణించారు. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారని గాజా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. పౌరులకు సాయం చేసేందుకు దాడులకు విరామం ప్రకటించాలని అమెరికా విజ్ఞప్తి చేసినా ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గలేదు. గాజాపై నిర్విరామంగా జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

Israel Attack On Gaza Latest News
Israel Attack On Gaza Latest News

Israel Attack On Gaza Latest News : హమాస్‌ మిలిటెంట్లను హతమార్చడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు ప్రపంచ దేశాలు వద్దని వారిస్తున్నా.. ఇజ్రాయెల్‌ సైన్యం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 52 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు.

అమెరికా విజ్ఞప్తి చేసిన కాసేపటికే..
Israel Gaza Update Today : గాజా పౌరులకు సాయం చేయడానికి దాడులకు విరామం ప్రకటించాలని అమెరికా విజ్ఞప్తి చేసినా దానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. తర్వాత కాసేపటికే ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 9,480 మంది పౌరులు మరణించారని.. అందులో మహిళలు, పిల్లలే ఎక్కువమంది ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Israel Attack On Gaza Latest News
గాజాపై ఇజ్రాయెల్​ దాడి దృశ్యాలు

పాఠశాలపై జరిపిన దాడుల్లో 12 మంది..
Israel Gaza War 2023 : వేలాది మంది ఆశ్రయం పొందుతున్న ఐక్యరాజ్యసమితి పాఠశాలపై శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది చిన్నారులు మరణించారని హమాస్ తెలిపింది. అయితే గాజాను.. హమాస్ టెర్రర్ ఆర్గనైజేషన్ సెంటర్‌గా పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్.. తమ బలగాలు గాజాను చుట్టుముట్టాయని వెల్లడించారు. గాజాలో ఇప్పటివరకు 12 వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

బ్లింకెన్​ దౌత్య ప్రయత్నాలు!
Israel Gaza America : ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. కాల్పుల విరమణపై చేసిన ప్రతిపాదనను నెతన్యాహు ప్రభుత్వం తిరస్కరించింది. అయితే పశ్చిమాసియాలో అరబ్‌ నేతలతో బ్లింకెన్‌ సమావేశమవుతూ దౌత్య ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లింకెన్ జోర్డాన్‌లో అరబ్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. గాజాలో జరుగుతున్న దాడులపై బ్లింకెన్‌ ముందు అరబ్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 3న్నర నుంచి 4 లక్షల మంది పౌరులు ఉత్తర గాజాలోనే ఉన్నారని.. వారికి ఏదైనా జరిగితే ఇజ్రాయెల్‌దే బాధ్యత అని అరబ్‌ దేశాలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో గాజాలో పౌర మరణాలను ఆపడానికి చేసే మానవతా విరామాలకు అమెరికా మద్దతిస్తుందని బ్లింకెన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము చేస్తున్న ప్రయత్నాలన్నీ గాజాలో శాంతి నెలకొల్పుతాయనే విశ్వాసం ఉందని బ్లింకెన్ తెలిపారు. అయితే తమ దాడిలో గాయపడిన ఇజ్రాయెల్‌ సైనికులు రఫా సరిహద్దు నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని, అందుకే గాజా నుంచి విదేశీయుల తరలింపును తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు హమాస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Israel Attack On Gaza Latest News
ఆందోళన చేపడుతున్న ప్రజలు

ప్రపంచ దేశాల ఆందోళన!
Israel Gaza War Protests : గాజాలో దాడి తర్వాత ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ నుంచి తన రాయబారిని తుర్కియే రీకాల్ చేసింది. గాజాలో మహిళలు, పిల్లల మరణాలకు నెతన్యాహు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అన్నారు. మరోవైపు గాజాలో పెరుగుతున్న మరణాల సంఖ్యపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాషింగ్టన్ నుంచి బెర్లిన్ వరకు వేలాది మంది వీధుల్లోకి వచ్చి తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేశారు.

ఆస్పత్రి ప్రాంగణంపై ఇజ్రాయెల్​ రాకెట్ల దాడి- అంబులెన్స్​లు ధ్వంసం, అనేక మంది రోగులు మృతి

అంబులెన్స్​ కాన్వాయ్​పై వైమానిక దాడి- తీవ్రంగా భయపడ్డానన్న ఐరాస చీఫ్!​

Israel Attack On Gaza Latest News : హమాస్‌ మిలిటెంట్లను హతమార్చడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు ప్రపంచ దేశాలు వద్దని వారిస్తున్నా.. ఇజ్రాయెల్‌ సైన్యం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 52 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు.

అమెరికా విజ్ఞప్తి చేసిన కాసేపటికే..
Israel Gaza Update Today : గాజా పౌరులకు సాయం చేయడానికి దాడులకు విరామం ప్రకటించాలని అమెరికా విజ్ఞప్తి చేసినా దానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. తర్వాత కాసేపటికే ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 9,480 మంది పౌరులు మరణించారని.. అందులో మహిళలు, పిల్లలే ఎక్కువమంది ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Israel Attack On Gaza Latest News
గాజాపై ఇజ్రాయెల్​ దాడి దృశ్యాలు

పాఠశాలపై జరిపిన దాడుల్లో 12 మంది..
Israel Gaza War 2023 : వేలాది మంది ఆశ్రయం పొందుతున్న ఐక్యరాజ్యసమితి పాఠశాలపై శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది చిన్నారులు మరణించారని హమాస్ తెలిపింది. అయితే గాజాను.. హమాస్ టెర్రర్ ఆర్గనైజేషన్ సెంటర్‌గా పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్.. తమ బలగాలు గాజాను చుట్టుముట్టాయని వెల్లడించారు. గాజాలో ఇప్పటివరకు 12 వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

బ్లింకెన్​ దౌత్య ప్రయత్నాలు!
Israel Gaza America : ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. కాల్పుల విరమణపై చేసిన ప్రతిపాదనను నెతన్యాహు ప్రభుత్వం తిరస్కరించింది. అయితే పశ్చిమాసియాలో అరబ్‌ నేతలతో బ్లింకెన్‌ సమావేశమవుతూ దౌత్య ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లింకెన్ జోర్డాన్‌లో అరబ్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. గాజాలో జరుగుతున్న దాడులపై బ్లింకెన్‌ ముందు అరబ్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 3న్నర నుంచి 4 లక్షల మంది పౌరులు ఉత్తర గాజాలోనే ఉన్నారని.. వారికి ఏదైనా జరిగితే ఇజ్రాయెల్‌దే బాధ్యత అని అరబ్‌ దేశాలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో గాజాలో పౌర మరణాలను ఆపడానికి చేసే మానవతా విరామాలకు అమెరికా మద్దతిస్తుందని బ్లింకెన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము చేస్తున్న ప్రయత్నాలన్నీ గాజాలో శాంతి నెలకొల్పుతాయనే విశ్వాసం ఉందని బ్లింకెన్ తెలిపారు. అయితే తమ దాడిలో గాయపడిన ఇజ్రాయెల్‌ సైనికులు రఫా సరిహద్దు నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని, అందుకే గాజా నుంచి విదేశీయుల తరలింపును తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు హమాస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Israel Attack On Gaza Latest News
ఆందోళన చేపడుతున్న ప్రజలు

ప్రపంచ దేశాల ఆందోళన!
Israel Gaza War Protests : గాజాలో దాడి తర్వాత ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ నుంచి తన రాయబారిని తుర్కియే రీకాల్ చేసింది. గాజాలో మహిళలు, పిల్లల మరణాలకు నెతన్యాహు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అన్నారు. మరోవైపు గాజాలో పెరుగుతున్న మరణాల సంఖ్యపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాషింగ్టన్ నుంచి బెర్లిన్ వరకు వేలాది మంది వీధుల్లోకి వచ్చి తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేశారు.

ఆస్పత్రి ప్రాంగణంపై ఇజ్రాయెల్​ రాకెట్ల దాడి- అంబులెన్స్​లు ధ్వంసం, అనేక మంది రోగులు మృతి

అంబులెన్స్​ కాన్వాయ్​పై వైమానిక దాడి- తీవ్రంగా భయపడ్డానన్న ఐరాస చీఫ్!​

Last Updated : Nov 5, 2023, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.