ETV Bharat / international

'కీవ్'​ లక్ష్యంగా రష్యా దూకుడు.. 65 కి.మీ. పొడవున మోహరింపులు

Ukraine Russia War: గతకొద్ది రోజులుగా ఉక్రెయిన్​పై దాడులు చేస్తున్న రష్యా బలగాలు.. ఆ దేశ రాజధాని కీవ్​ నగరమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. కీవ్​-ఖార్​కివ్​ మధ్య ఉన్న ఒఖ్​తిర్కా మిలిటరీ బేస్​పై రష్యా​ జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్​ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యన్ల దాడిలో ఇప్పటివరకు 350 మంది ఉక్రెయిన్​ పౌరులు మృతిచెందినట్లు ఆ దేశం వెల్లడించింది.

author img

By

Published : Mar 1, 2022, 12:13 PM IST

ukraine
ఉక్రెయిన్

Ukraine Russia War: ఓ వైపు ఉక్రెయిన్​తో చర్చలు జరుపుతూనే ఆ దేశంపై దాడులు కొనసాగిస్తోంది రష్యా. రాజధాని కీవ్​వైపు రష్యా సేనలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ సాయుధ కాన్వాయ్‌ను ఉపగ్రహ చిత్రాలు గుర్తించాయి. దీని పొడవు 65 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ నగరాల్లో ఈ ఉదయం నుంచి ఎయిర్‌ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. కీవ్‌తోపాటు పశ్చిమ నగరాలైన టెర్రోపిల్‌, రివ్నే తదితర ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయని స్థానికులు తెలిపారు.

కీవ్​- ఖార్​కివ్​ మధ్య ఉన్న ఒఖ్​తిర్కా మిలిటరీ బేస్​పై రష్యన్​ బలగాలు జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్​ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్​ సైనికాధికారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను షేర్​ చేశారు. ఇరు దేశాల బలగాల మధ్య ఆదివారం జరిగిన పోరులో ఎంతో మంది రష్యన్​ సైనికులు సహా స్థానికులు కూడా మృతి చెందినట్లు తెలిపారు.

350 మంది పౌరులు మృతి: ఉక్రెయిన్‌

తొలుత ఉక్రెయిన్​ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా.. ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోని పలు నివాస ప్రాంతాలపై రష్యా బాంబులు విసిరింది. గత గరువారం నుంచి రష్యా దాడుల్లో 352 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. వీరిలో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారు.

ఆస్ట్రేలియా సాయం

రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్​కు సాయం అందించనున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా. 50 మిలియన్​ డాలర్లు విలువ చేసే ఆయుధాలను ఉక్రెయిన్​కు అందిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ వెల్లడించారు.

రష్యాపై ఆంక్షలు

రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికే వివిధ ఆంక్షలను విధించాయి. తాజాగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐరాసలో రష్యాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది సభ్యులను తమ దేశం నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి వాసిలీ నెబెన్జియా వెల్లడించారు.

అంతేకాదు.. ఇటు క్రీడా రంగానికి సంబంధించి కూడా రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ ఐస్​ హాకీ ఫెడరేషన్ (ఐఐహెచ్​ఎఫ్​) ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రపంచ జూనియర్​ ఛాంపియన్​షిప్​పై రష్యాకు ఉన్న ఆతిథ్య హక్కులను రద్దు చేసింది. త్వరలో చర్చల ద్వారా మరో వేదికను నిర్ణయించనున్నట్లు ఐఐహెచ్​ఎఫ్​ స్పష్టం చేసింది. దీంతో పాటు.. తమ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో రష్యా, బెలారస్​ దేశాలకు చెందిన జట్లు, క్లబ్​లు పాల్గొనడంపై ఐఐహెచ్​ఎఫ్​ నిషేధం విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.

ఆ ఆదేశాల వెనుక బ్రిటన్!

అణ్వాయుధాల వినియోగానికి సిద్ధంగా ఉండాలంటూ ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన ఆదేశాల వెనుక బ్రిటన్‌ ఉందా? అంటే అవుననే అంటోంది మాస్కో. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే తమ అధ్యక్షుడు అణ్వాయుధాల మోహరింపునకు ఆదేశాలిచ్చారని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ఆదివారం తెలిపారు. ఉక్రెయిన్‌ దాడి విషయంలో చాలా మంది ప్రతినిధులు వివిధ స్థాయిల్లో నాటో కూటమికి రష్యాకు మధ్య ఘర్షణలు చోటు చేసుకోవచ్చని చెప్పారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారని విలేకరులు ప్రశ్నించినపుడు పెస్కోవ్‌ పేరు తీయనంటూనే.. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి అని చెప్పారు.

చర్చలతో పరిష్కరించుకోండి: అరబ్‌లీగ్‌

ఉక్రెయిన్‌లో యుద్ధంపై అరబ్‌లీగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యను చర్చలతో పరిష్కరించుకోవాలని ప్రకటన విడుదల చేసింది. ఎక్కడా రష్యా పేరును ప్రస్తావించలేదు. 22 దేశాల అరబ్‌లీగ్‌లో సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ తదితర దేశాలు ఉన్నాయి.

ఇదీ చూడండి : ప్రెసిడెంట్​ పుతిన్‌ 'అణ్వస్త్రం' ప్రయోగిస్తారా?.. ఒకవేళ చేస్తే!

Ukraine Russia War: ఓ వైపు ఉక్రెయిన్​తో చర్చలు జరుపుతూనే ఆ దేశంపై దాడులు కొనసాగిస్తోంది రష్యా. రాజధాని కీవ్​వైపు రష్యా సేనలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ భారీ సాయుధ కాన్వాయ్‌ను ఉపగ్రహ చిత్రాలు గుర్తించాయి. దీని పొడవు 65 కి.మీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ నగరాల్లో ఈ ఉదయం నుంచి ఎయిర్‌ సైరన్ల మోతలు వినిపిస్తున్నాయి. కీవ్‌తోపాటు పశ్చిమ నగరాలైన టెర్రోపిల్‌, రివ్నే తదితర ప్రాంతాల్లో సైరన్లు వినిపించాయని స్థానికులు తెలిపారు.

కీవ్​- ఖార్​కివ్​ మధ్య ఉన్న ఒఖ్​తిర్కా మిలిటరీ బేస్​పై రష్యన్​ బలగాలు జరిపిన దాడిలో 70 మంది ఉక్రెయిన్​ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్​ సైనికాధికారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను షేర్​ చేశారు. ఇరు దేశాల బలగాల మధ్య ఆదివారం జరిగిన పోరులో ఎంతో మంది రష్యన్​ సైనికులు సహా స్థానికులు కూడా మృతి చెందినట్లు తెలిపారు.

350 మంది పౌరులు మృతి: ఉక్రెయిన్‌

తొలుత ఉక్రెయిన్​ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా.. ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోని పలు నివాస ప్రాంతాలపై రష్యా బాంబులు విసిరింది. గత గరువారం నుంచి రష్యా దాడుల్లో 352 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ వెల్లడించింది. వీరిలో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారు.

ఆస్ట్రేలియా సాయం

రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్​కు సాయం అందించనున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా. 50 మిలియన్​ డాలర్లు విలువ చేసే ఆయుధాలను ఉక్రెయిన్​కు అందిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ వెల్లడించారు.

రష్యాపై ఆంక్షలు

రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికే వివిధ ఆంక్షలను విధించాయి. తాజాగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐరాసలో రష్యాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది సభ్యులను తమ దేశం నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి వాసిలీ నెబెన్జియా వెల్లడించారు.

అంతేకాదు.. ఇటు క్రీడా రంగానికి సంబంధించి కూడా రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ ఐస్​ హాకీ ఫెడరేషన్ (ఐఐహెచ్​ఎఫ్​) ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రపంచ జూనియర్​ ఛాంపియన్​షిప్​పై రష్యాకు ఉన్న ఆతిథ్య హక్కులను రద్దు చేసింది. త్వరలో చర్చల ద్వారా మరో వేదికను నిర్ణయించనున్నట్లు ఐఐహెచ్​ఎఫ్​ స్పష్టం చేసింది. దీంతో పాటు.. తమ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో రష్యా, బెలారస్​ దేశాలకు చెందిన జట్లు, క్లబ్​లు పాల్గొనడంపై ఐఐహెచ్​ఎఫ్​ నిషేధం విధించింది. తదుపరి ఆదేశాల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.

ఆ ఆదేశాల వెనుక బ్రిటన్!

అణ్వాయుధాల వినియోగానికి సిద్ధంగా ఉండాలంటూ ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన ఆదేశాల వెనుక బ్రిటన్‌ ఉందా? అంటే అవుననే అంటోంది మాస్కో. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే తమ అధ్యక్షుడు అణ్వాయుధాల మోహరింపునకు ఆదేశాలిచ్చారని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ఆదివారం తెలిపారు. ఉక్రెయిన్‌ దాడి విషయంలో చాలా మంది ప్రతినిధులు వివిధ స్థాయిల్లో నాటో కూటమికి రష్యాకు మధ్య ఘర్షణలు చోటు చేసుకోవచ్చని చెప్పారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారని విలేకరులు ప్రశ్నించినపుడు పెస్కోవ్‌ పేరు తీయనంటూనే.. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి అని చెప్పారు.

చర్చలతో పరిష్కరించుకోండి: అరబ్‌లీగ్‌

ఉక్రెయిన్‌లో యుద్ధంపై అరబ్‌లీగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యను చర్చలతో పరిష్కరించుకోవాలని ప్రకటన విడుదల చేసింది. ఎక్కడా రష్యా పేరును ప్రస్తావించలేదు. 22 దేశాల అరబ్‌లీగ్‌లో సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ తదితర దేశాలు ఉన్నాయి.

ఇదీ చూడండి : ప్రెసిడెంట్​ పుతిన్‌ 'అణ్వస్త్రం' ప్రయోగిస్తారా?.. ఒకవేళ చేస్తే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.