ETV Bharat / international

Vaccination: 'ఆ దేశాలు వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలి'

author img

By

Published : Jun 20, 2021, 8:51 PM IST

మరో కొవిడ్ ఉద్ధృతి రాకముందే ఆరోగ్య వసతులు పెంచాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) సూచించింది. ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను(Vaccination) వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. భౌతిక దూరం, చేతులు శుభ్రపరుచుకోవడం, మాస్కులు ధరించడం తప్పనిసరి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

WHO
డబ్ల్యూహెచ్​ఓ

కొవిడ్ మరో ఉద్ధృతి రాకమునుపే.... ఆరోగ్య మౌలిక వసతులు పెంచి, వ్యాక్సినేషన్‌ను(Vaccination) వేగవంతం చేయాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కోరింది. కొత్త కరోనా వేరియంట్లు వ్యాపిస్తున్నట్లు మాల్దీవులు, మయన్మార్‌ ప్రకటించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో వేర్వేరు కొవిడ్‌ వేరియంట్లు వ్యాపిస్తున్నట్లు ఇదివరకే తేలింది.

లాక్‌డౌన్‌ల నుంచి ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ సూచనలు చేసింది. భౌతిక దూరం, చేతులు శుభ్రపరుచుకోవడం, సరిగ్గా మాస్కులు ధరించడం వంటి చర్యలను పక్కాగా అమలు చేయాలని పేర్కొంది. కొవిడ్ వ్యాప్తి విషయంలో వివిధ దేశాలు వివిద దశల్ని ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. కాబట్టి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి.. దిగువ స్థాయి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజారోగ్య చర్యలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

కొవిడ్ మరో ఉద్ధృతి రాకమునుపే.... ఆరోగ్య మౌలిక వసతులు పెంచి, వ్యాక్సినేషన్‌ను(Vaccination) వేగవంతం చేయాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కోరింది. కొత్త కరోనా వేరియంట్లు వ్యాపిస్తున్నట్లు మాల్దీవులు, మయన్మార్‌ ప్రకటించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో వేర్వేరు కొవిడ్‌ వేరియంట్లు వ్యాపిస్తున్నట్లు ఇదివరకే తేలింది.

లాక్‌డౌన్‌ల నుంచి ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ సూచనలు చేసింది. భౌతిక దూరం, చేతులు శుభ్రపరుచుకోవడం, సరిగ్గా మాస్కులు ధరించడం వంటి చర్యలను పక్కాగా అమలు చేయాలని పేర్కొంది. కొవిడ్ వ్యాప్తి విషయంలో వివిధ దేశాలు వివిద దశల్ని ఎదుర్కొంటున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. కాబట్టి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి.. దిగువ స్థాయి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజారోగ్య చర్యలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి: 5 లక్షల కరోనా మరణాలు- అధ్యక్షుడిపై ప్రజల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.