ETV Bharat / international

ఆ దేశ​ మంత్రికి కరోనా.. ప్రభుత్వమంతా నిర్బంధంలోనే!

పోలాండ్​లో ఓ మంత్రికి కరోనా వైరస్​ సోకింది. ఫలితంగా.. అక్కడి ప్రభుత్వంలోని మంత్రులు సహా ఇతర సిబ్బంది అందరినీ నిర్బంధంలో ఉంచారు.

author img

By

Published : Mar 17, 2020, 6:26 PM IST

Poland govt in quarantine after minister diagnosed with virus
పోలండ్​ మంత్రికి కరోనా.. ప్రభుత్వమంతా నిర్బంధంలోనే!

మహమ్మారి కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎక్కడికక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలూ అదే స్థాయిలో ఉన్నాయి. పోలాండ్​లో ఓ మంత్రికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ముందు జాగ్రత్తగా అక్కడి ప్రభుత్వ యంత్రాంగమంతా నిర్బంధంలో ఉంది.

ఈ నెల 10న పోలాండ్​ సర్కార్​ కీలక సమావేశం నిర్వహించింది. మంత్రులు సహా.. ప్రభుత్వ సిబ్బంది అంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఓ మంత్రికి వైరస్​ సోకినట్లు తేలగా.. అందరినీ నిర్బంధంలో ఉంచి పరిశీలిస్తున్నారు.

కొవిడ్​-19 పరీక్షలు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు అధికారులు. అప్పటివరకు వీరంతా నిర్బంధంలో ఉండనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వైరస్సే కదా అని తేలిగ్గా చూస్తే.. అధ్యక్ష ఎన్నికలు ఆపేస్తా!

మహమ్మారి కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎక్కడికక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలూ అదే స్థాయిలో ఉన్నాయి. పోలాండ్​లో ఓ మంత్రికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ముందు జాగ్రత్తగా అక్కడి ప్రభుత్వ యంత్రాంగమంతా నిర్బంధంలో ఉంది.

ఈ నెల 10న పోలాండ్​ సర్కార్​ కీలక సమావేశం నిర్వహించింది. మంత్రులు సహా.. ప్రభుత్వ సిబ్బంది అంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఓ మంత్రికి వైరస్​ సోకినట్లు తేలగా.. అందరినీ నిర్బంధంలో ఉంచి పరిశీలిస్తున్నారు.

కొవిడ్​-19 పరీక్షలు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు అధికారులు. అప్పటివరకు వీరంతా నిర్బంధంలో ఉండనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వైరస్సే కదా అని తేలిగ్గా చూస్తే.. అధ్యక్ష ఎన్నికలు ఆపేస్తా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.