ఇటలీలో కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలను తీవ్రతరం చేసింది ఆ దేశ ప్రభుత్వం. రోమ్-వాటికన్ ప్రాంతంలో రోడ్లపై కార్లను ఆపి తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ ప్రభుత్వం.
కాథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్.. వాటికన్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే కొంత మందిని తన ప్రైవేట్ లైబ్రరీలో ఉంచారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సామాజిక సమావేశాలు, అనవరసర ప్రయాణాలపై నిషేధం విధించింది ఆ దేశ ప్రభుత్వం. అయితే.. వృత్తి రీత్యా కారణాల వల్ల బయటకు రావొచ్చని సూచించింది.
ఇప్పటివరకు ఇటలీలో 977 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 10,149కు చేరింది. వైరస్ బారినపడి 631 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి: వుహాన్లో వైరస్ తగ్గుముఖం.. తెరుచుకోనున్న కంపెనీలు