ETV Bharat / international

వుహాన్​లో వైరస్​ తగ్గుముఖం.. తెరుచుకోనున్న కంపెనీలు

author img

By

Published : Mar 11, 2020, 8:29 PM IST

Updated : Mar 11, 2020, 10:46 PM IST

కరోనా​ కేంద్ర బిందువైన చైనా వుహాన్​ నగరంలోని ప్రముఖ కంపెనీలు తెరుచుకోనున్నాయి. ఆ ప్రాంతంలో కొత్త వైరస్​ కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

China allows some firms to resume work at virus epicentre
వుహాన్​లో వైరస్​ తగ్గుముఖం.. తెరుచుకోనున్న కంపెనీలు
వుహాన్​లో వైరస్​ తగ్గుముఖం.. తెరుచుకోనున్న కంపెనీలు

చైనాలోని వుహాన్​ నగరం కొద్ది రోజులుగా కరోనా వైరస్​తో స్తంభించిపోయింది. ప్రస్తుతం అక్కడ వైరస్​ ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. ప్రముఖ కంపెనీలు తెరుచుకోనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. వైరస్​పై పోరులో వుహాన్​ విజయం సాధిస్తోందని ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రధానంగా నిత్యవసర ఉత్పత్తులు, వైరస్​ కట్టడి సామగ్రి, ప్రజావసరాల సంస్థల వంటివి వెంటనే తెరుచుకోనున్నట్లు వెల్లడించింది హుబే రాష్ట్ర ప్రభుత్వం. వుహాన్​ నగరం అంతర్జాతీయ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈనెల 20 తర్వాత మరిన్ని సంస్థలు ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు అధికారులు.

మంగళవారం.. వైరస్​ కేంద్రబిందువైన వుహాన్​లో చైనా అధ్యక్షుడు తొలిసారి పర్యటించారు. ఆ మరుసటి రోజేే ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కొద్ది వారాలుగా వుహాన్​లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. హుబే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కొద్ది రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

వైరస్​ ప్రభావం లేని ప్రాంతాల్లో..

వుహాన్​ మినహా.. వైరస్​ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విమానం, రైళ్లు, ఓడలు, సిటీ బస్సుల సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. హుబే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కఠిన నియంత్రణ చర్యలను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు అధికారులు. వైరస్​ కేసుతో ఎలాంటి సంబంధం లేనివారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అయితే పాఠశాలలు మాత్రం.. మూతపడే ఉంటాయని చెప్పారు.

వైరస్​ వ్యాప్తి కారణంగా చైనాలో ఇప్పటివరకు 3,100మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. సుమారు 81వేల వైరస్​ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: కరోనాను గుర్తించేందుకు ఆ 5 రోజులు చాలు!

వుహాన్​లో వైరస్​ తగ్గుముఖం.. తెరుచుకోనున్న కంపెనీలు

చైనాలోని వుహాన్​ నగరం కొద్ది రోజులుగా కరోనా వైరస్​తో స్తంభించిపోయింది. ప్రస్తుతం అక్కడ వైరస్​ ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. ప్రముఖ కంపెనీలు తెరుచుకోనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. వైరస్​పై పోరులో వుహాన్​ విజయం సాధిస్తోందని ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రధానంగా నిత్యవసర ఉత్పత్తులు, వైరస్​ కట్టడి సామగ్రి, ప్రజావసరాల సంస్థల వంటివి వెంటనే తెరుచుకోనున్నట్లు వెల్లడించింది హుబే రాష్ట్ర ప్రభుత్వం. వుహాన్​ నగరం అంతర్జాతీయ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈనెల 20 తర్వాత మరిన్ని సంస్థలు ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు అధికారులు.

మంగళవారం.. వైరస్​ కేంద్రబిందువైన వుహాన్​లో చైనా అధ్యక్షుడు తొలిసారి పర్యటించారు. ఆ మరుసటి రోజేే ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కొద్ది వారాలుగా వుహాన్​లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. హుబే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కొద్ది రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

వైరస్​ ప్రభావం లేని ప్రాంతాల్లో..

వుహాన్​ మినహా.. వైరస్​ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విమానం, రైళ్లు, ఓడలు, సిటీ బస్సుల సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. హుబే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కఠిన నియంత్రణ చర్యలను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు అధికారులు. వైరస్​ కేసుతో ఎలాంటి సంబంధం లేనివారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అయితే పాఠశాలలు మాత్రం.. మూతపడే ఉంటాయని చెప్పారు.

వైరస్​ వ్యాప్తి కారణంగా చైనాలో ఇప్పటివరకు 3,100మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. సుమారు 81వేల వైరస్​ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: కరోనాను గుర్తించేందుకు ఆ 5 రోజులు చాలు!

Last Updated : Mar 11, 2020, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.