ETV Bharat / international

'భారత్..​ భాగస్వామి మాత్రమే కాదు ప్రత్యర్థి కూడా'

author img

By

Published : Jan 12, 2021, 2:16 PM IST

బ్రెగ్జిట్​ తర్వాత పలు దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి, ఉదార ప్రజాస్వామ్య దేశాలను అనుసంధానం చేయడంపై దృష్టిసారిస్తుంది బ్రిటన్. ముఖ్యంగా భారత్​తో లోతైన సంబంధాలు ఏర్పరుచుకోవాలని చూస్తుంది. అయితే ఇది బ్రిటన్​పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని లండన్​కు చెందిన ఓ సంస్థ పేర్కొంది.

India not just commercial partner, but also rival to post-Brexit UK: Report
'భారత్​ను వాణిజ్య భాగస్వామిగానే కాదు- ప్రత్యర్థిగానూ చూడాలి'

ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి విడిపోయి స్వతంత్రంగా దేశంగా మారిన బ్రిటన్.. భారత్​ను కీలక వాణిజ్య భాగస్వామిగా చేసుకోవాలని యోచిస్తుంది. అయితే భారత్​ను వాణిజ్య భాగస్వామిగానే కాకుండా.. ప్రత్యర్థిగాను చూడాలని పేర్కొంది అంతర్జాతీయ వ్యవహారాలను అంచనా వేసే చాతమ్​హౌస్(రాయల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇంటర్నెషనల్​ అఫైర్స్​) సంస్థ​. ఈ మేరకు 'గ్లోబల్​ బ్రిటన్​, గ్లోబల్​ బ్రోకర్​: బ్రిటన్ భవిష్యత్​- అంతర్జాతీయ పాత్ర' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోని ఉదార ప్రజాస్వామ్య దేశాలను అనుసంధానించి గ్లోబల్​ బ్రోకర్‌గా అవతరించడానికి, అలాగే ఈయూ సభ్య దేశాలతో సహా అమెరికాతో సంబంధాలు కొనసాగించడంపై బ్రిటన్​ దృష్టి సారించిందని చాతమ్​హౌస్​ పేర్కొంది.

బ్రిటన్​ లక్ష్యాల విషయంలో విభేదాలు

"చైనా నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా ఆసియా- పసిఫక్​ ప్రాంతంలోని ప్రజాస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలు.. అమెరికా-బ్రిటిష్ కూటమిలో భాగంగా ఉన్నాయి. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం చైనా, భారత్​, సౌదీ అరేబియా టర్కీ వంటి దేశాలతో లోతైనా సంబంధాల కోసం బ్రిటన్​ ప్రయత్నిస్తోంది. దీనివల్ల 'గ్లోబల్​ బ్రిటన్'​ లక్ష్యాల విషయంలో విభేదాలు వచ్చే అవకాశముంది" అని చాతమ్​హౌస్​ హెచ్చరించింది.

అలా ఉండటం కష్టమే

"బ్రిటన్​.. భారత్​తో కీలక సంబంధాలు కుదుర్చుకోకుండా ఉండటం కష్టమే. ఎందుకంటే.. సమీప భవిష్యత్​లో జనాభా పరంగా అతిపెద్ద దేశంగా భారత్​ అవతరించనుంది. ఆర్థికంగానూ ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది. రక్షణ వ్యవస్థలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టనుంది" అని చాతమ్ పేర్కొంది. అయితే చరిత్రను దృష్టిలో ఉంచుకుని భారత్​తో సంబంధాల విషయంలో బ్రిటన్​ జాగ్రత్త వహించాలని సూచించింది.

భారత్​ తీరు

"గతంలో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అలీన ఉద్యమానికి నాయకత్వం వహించింది భారత్.​ 2017లో అధికారికంగా చైనా, రష్యా నేతృత్వంలోని షాంఘై సహకార సంస్థలో చేరింది." నివేదికలో ప్రస్తావించింది.

అందుకే భవిష్యత్​లో బ్రిటన్​కు భారత్​తో దౌత్య, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవచ్చని చాతమ్ పేర్కొంది​.

భారత్​లో సవాళ్లు

భారత్​లోని సంక్లిష్ట రాజకీయాలను కూడా ఈ నివేదికలో ప్రస్తావించింది చాతమ్​​. స్వేచ్ఛా వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల నిరోధక దేశాల్లో భారత్​ ఒకటిగా నిలిచిందని పేర్కొంది. భారత్​ గురించి కొన్ని గ్రూపులతో పాటు ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రజాస్వామ్య పరిశీలకులు లేవనెత్తిన ఆందోళనలను గురించి పేర్కొంది.

గ్లోబల్​ బ్రోకర్​గా ఎదగాలంటే..

"బ్రిటన్​.. గ్లోబల్​ బ్రోకర్​గా ఎదగాలంటే ఉదార ప్రజాస్వామ్య దేశాలను రక్షించే లేదా మద్దతు గ్రూపులో ప్రముఖ సభ్య దేశంగా ఉండాలి. నియమాల ఆధారిత అంతర్జాతీయ సహకారానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్య, ప్రజాస్వామ్యేతర దేశాలను అనుసంధానం చేసి, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పంచుకోవడానికి సాధ్యపడవచ్చు" అని పేర్కొంది చాతమ్​.

ఇదీ చూడండి: ఆఫ్రికాలో ఉగ్రవాదంపై భారత్ ఆందోళన స్వరం

ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి విడిపోయి స్వతంత్రంగా దేశంగా మారిన బ్రిటన్.. భారత్​ను కీలక వాణిజ్య భాగస్వామిగా చేసుకోవాలని యోచిస్తుంది. అయితే భారత్​ను వాణిజ్య భాగస్వామిగానే కాకుండా.. ప్రత్యర్థిగాను చూడాలని పేర్కొంది అంతర్జాతీయ వ్యవహారాలను అంచనా వేసే చాతమ్​హౌస్(రాయల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇంటర్నెషనల్​ అఫైర్స్​) సంస్థ​. ఈ మేరకు 'గ్లోబల్​ బ్రిటన్​, గ్లోబల్​ బ్రోకర్​: బ్రిటన్ భవిష్యత్​- అంతర్జాతీయ పాత్ర' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోని ఉదార ప్రజాస్వామ్య దేశాలను అనుసంధానించి గ్లోబల్​ బ్రోకర్‌గా అవతరించడానికి, అలాగే ఈయూ సభ్య దేశాలతో సహా అమెరికాతో సంబంధాలు కొనసాగించడంపై బ్రిటన్​ దృష్టి సారించిందని చాతమ్​హౌస్​ పేర్కొంది.

బ్రిటన్​ లక్ష్యాల విషయంలో విభేదాలు

"చైనా నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా ఆసియా- పసిఫక్​ ప్రాంతంలోని ప్రజాస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలు.. అమెరికా-బ్రిటిష్ కూటమిలో భాగంగా ఉన్నాయి. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం చైనా, భారత్​, సౌదీ అరేబియా టర్కీ వంటి దేశాలతో లోతైనా సంబంధాల కోసం బ్రిటన్​ ప్రయత్నిస్తోంది. దీనివల్ల 'గ్లోబల్​ బ్రిటన్'​ లక్ష్యాల విషయంలో విభేదాలు వచ్చే అవకాశముంది" అని చాతమ్​హౌస్​ హెచ్చరించింది.

అలా ఉండటం కష్టమే

"బ్రిటన్​.. భారత్​తో కీలక సంబంధాలు కుదుర్చుకోకుండా ఉండటం కష్టమే. ఎందుకంటే.. సమీప భవిష్యత్​లో జనాభా పరంగా అతిపెద్ద దేశంగా భారత్​ అవతరించనుంది. ఆర్థికంగానూ ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానుంది. రక్షణ వ్యవస్థలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టనుంది" అని చాతమ్ పేర్కొంది. అయితే చరిత్రను దృష్టిలో ఉంచుకుని భారత్​తో సంబంధాల విషయంలో బ్రిటన్​ జాగ్రత్త వహించాలని సూచించింది.

భారత్​ తీరు

"గతంలో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అలీన ఉద్యమానికి నాయకత్వం వహించింది భారత్.​ 2017లో అధికారికంగా చైనా, రష్యా నేతృత్వంలోని షాంఘై సహకార సంస్థలో చేరింది." నివేదికలో ప్రస్తావించింది.

అందుకే భవిష్యత్​లో బ్రిటన్​కు భారత్​తో దౌత్య, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవచ్చని చాతమ్ పేర్కొంది​.

భారత్​లో సవాళ్లు

భారత్​లోని సంక్లిష్ట రాజకీయాలను కూడా ఈ నివేదికలో ప్రస్తావించింది చాతమ్​​. స్వేచ్ఛా వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల నిరోధక దేశాల్లో భారత్​ ఒకటిగా నిలిచిందని పేర్కొంది. భారత్​ గురించి కొన్ని గ్రూపులతో పాటు ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రజాస్వామ్య పరిశీలకులు లేవనెత్తిన ఆందోళనలను గురించి పేర్కొంది.

గ్లోబల్​ బ్రోకర్​గా ఎదగాలంటే..

"బ్రిటన్​.. గ్లోబల్​ బ్రోకర్​గా ఎదగాలంటే ఉదార ప్రజాస్వామ్య దేశాలను రక్షించే లేదా మద్దతు గ్రూపులో ప్రముఖ సభ్య దేశంగా ఉండాలి. నియమాల ఆధారిత అంతర్జాతీయ సహకారానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్య, ప్రజాస్వామ్యేతర దేశాలను అనుసంధానం చేసి, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పంచుకోవడానికి సాధ్యపడవచ్చు" అని పేర్కొంది చాతమ్​.

ఇదీ చూడండి: ఆఫ్రికాలో ఉగ్రవాదంపై భారత్ ఆందోళన స్వరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.