ETV Bharat / international

జనాలకు కరోనా అంటించి మరీ బ్రిటన్​ ప్రయోగాలు

author img

By

Published : Oct 20, 2020, 5:11 PM IST

ఉద్దేశపూర్వకంగా వైరస్​ సోకేలా చేసే వివాదాస్పద 'హ్యూమన్ ఛాలెంజ్'​ ప్రయోగానికి సిద్ధమవుతోంది బ్రిటన్​. దీనికోసం 33.6 మిలియన్ పౌండ్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. 18నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 90మంది ఆరోగ్యవంతమైన వలంటీర్లపై ఈ పరిశోధన జరపనుంది. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి ఈ ప్రయోగం అత్యంత కీలకంగా మారుతుందని బ్రిటన్​ ప్రభుత్వం తెలిపింది.

Coronavirus vaccine: UK volunteers to be deliberately infected people with virus
వివాదాస్పద 'హ్యూమన్ ఛాలెంజ్' ట్రయల్స్​కు బ్రిటన్ సిద్ధం

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో అత్యంత కీలకంగా మారనున్నట్లు భావిస్తున్న 'హ్యామన్ ఛాలెంజ్' ట్రయల్స్​ను ప్రారంభించనుంది బ్రిటన్ ప్రభుత్వం. ఈ ప్రయోగం కోసం 33.6 మిలియన్​ పౌండ్లను కేటాయించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. దీనికోసం 18నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 90 మంది వలంటీర్లను నియమిస్తున్నారు.

ప్రయోగంలో భాగంగా ఆరోగ్యవంతులైన వలంటీర్లకు ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్​ సోకేలా చేస్తారు. క్లినికల్​ ట్రయల్స్ పూర్తి చేసున్న వ్యాక్సిన్​ను వారికి ముందుగానే ఇస్తారు. దీని ద్వారా వైరస్ ప్రభావం, వ్యాక్సిన్​ సమర్థతపై కచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనాపై ఈ తరహా ప్రయోగాలు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

ఈ ప్రయోగం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది బ్రిటన్​ ప్రభుత్వం. వలంటీర్లను సురక్షితమైన నియంత్రిత వాతావరణంలో ఉంచుతుంది. వైరస్​ సోకేలా చేసిన తర్వాత వారిని 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఏమైనా దుష్ప్రభావాలు కన్పిస్తే వెంటనే అవసరమైన చికిత్స అందిస్తారు.

ప్రమాదకరం..

వలంటీర్లకు ఉద్దేశపూర్వకంగా వైరస్ సోకేలా చేయడమంటే ప్రమాదకరమైన విషయమని ఈ ప్రయోగం సహప రిశోధకులు పీటర్ ఒపెన్​షా తెలిపారు. ఇలాంటి ప్రయోగాల వల్ల వీలైనంత ఎక్కువ సమాచారం లభిస్తుందని పేర్కొన్నారు. గతంలోనూ ఈ తరహా పరిశోధనలు జరిగాయని గుర్తు చేశారు.

హ్యామన్ ఛాలెంజ్ ట్రయల్స్ ద్వారా రోగ నిరోధక శక్తి, వ్యాక్సిన్ ఎంతకాలం రక్షణ కల్పిస్తుంది, వైరస్​ తిరిగి సోకే ప్రమాదం ఏ మేరకు ఉందనే విషయాలపై స్పష్టత వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మునుపటిలా సాధారణ జీవితం పొందేందుకు అవసరమైన వ్యాక్సిన్ అభివృద్ధికి ఈ అంశాలు ఎంతో కీలకమన్నారు.

ఈ ప్రయోగానికి రెగ్యులేటర్స్ అండ్ ఎథిక్స్ కమిటీ ఆమోదం లభించిన అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ట్రయల్స్ ప్రారంభిస్తారు. మే నెల వరకు ఫలితాలు వచ్చే అవకాశముంది.

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో అత్యంత కీలకంగా మారనున్నట్లు భావిస్తున్న 'హ్యామన్ ఛాలెంజ్' ట్రయల్స్​ను ప్రారంభించనుంది బ్రిటన్ ప్రభుత్వం. ఈ ప్రయోగం కోసం 33.6 మిలియన్​ పౌండ్లను కేటాయించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. దీనికోసం 18నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 90 మంది వలంటీర్లను నియమిస్తున్నారు.

ప్రయోగంలో భాగంగా ఆరోగ్యవంతులైన వలంటీర్లకు ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్​ సోకేలా చేస్తారు. క్లినికల్​ ట్రయల్స్ పూర్తి చేసున్న వ్యాక్సిన్​ను వారికి ముందుగానే ఇస్తారు. దీని ద్వారా వైరస్ ప్రభావం, వ్యాక్సిన్​ సమర్థతపై కచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనాపై ఈ తరహా ప్రయోగాలు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

ఈ ప్రయోగం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది బ్రిటన్​ ప్రభుత్వం. వలంటీర్లను సురక్షితమైన నియంత్రిత వాతావరణంలో ఉంచుతుంది. వైరస్​ సోకేలా చేసిన తర్వాత వారిని 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఏమైనా దుష్ప్రభావాలు కన్పిస్తే వెంటనే అవసరమైన చికిత్స అందిస్తారు.

ప్రమాదకరం..

వలంటీర్లకు ఉద్దేశపూర్వకంగా వైరస్ సోకేలా చేయడమంటే ప్రమాదకరమైన విషయమని ఈ ప్రయోగం సహప రిశోధకులు పీటర్ ఒపెన్​షా తెలిపారు. ఇలాంటి ప్రయోగాల వల్ల వీలైనంత ఎక్కువ సమాచారం లభిస్తుందని పేర్కొన్నారు. గతంలోనూ ఈ తరహా పరిశోధనలు జరిగాయని గుర్తు చేశారు.

హ్యామన్ ఛాలెంజ్ ట్రయల్స్ ద్వారా రోగ నిరోధక శక్తి, వ్యాక్సిన్ ఎంతకాలం రక్షణ కల్పిస్తుంది, వైరస్​ తిరిగి సోకే ప్రమాదం ఏ మేరకు ఉందనే విషయాలపై స్పష్టత వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మునుపటిలా సాధారణ జీవితం పొందేందుకు అవసరమైన వ్యాక్సిన్ అభివృద్ధికి ఈ అంశాలు ఎంతో కీలకమన్నారు.

ఈ ప్రయోగానికి రెగ్యులేటర్స్ అండ్ ఎథిక్స్ కమిటీ ఆమోదం లభించిన అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ట్రయల్స్ ప్రారంభిస్తారు. మే నెల వరకు ఫలితాలు వచ్చే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.