ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా అరకోటి దాటిన కరోనా కేసులు

author img

By

Published : May 21, 2020, 7:22 AM IST

ప్రపంచదేశాలపై కరోనా మహహ్మారి పంజా విసురుతోంది. ఐదు నెలల క్రితం చైనాలో మొదలైన వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఉద్ధృతిని పెంచుకుంటూ మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య అరకోటి దాటింది. మృతుల సంఖ్య దాదాపు 3 లక్షల 30వేలకు చేరువైంది.

corona cases across the world crossed 50 millions mark
ప్రపంచ వ్యాప్తంగా అరకోటి దాటిన కరోనా కేసులు

దాదాపు ఐదు నెలల క్రితం చైనాలో చిన్న నిప్పు రవ్వలా ఆవిర్భవించిన కరోనా మహమ్మారి కార్చిచ్చులా మారింది! రోజురోజుకూ తన ఉద్ధృతిని పెంచుకుంటూ మానవాళిని బెంబేలెత్తిస్తోంది. అమెరికా, బ్రిటన్‌, రష్యా సహా అనేక దేశాలు దాని ధాటికి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో అతలాకుతలమవుతున్నాయి. మానవాళి మొత్తానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటింది. అందులో 15 లక్షలకుపైగా బాధితులు ఒక్క అమెరికాలోనే ఉన్నారంటే కొవిడ్‌ దెబ్బకు అగ్రరాజ్యం ఎంతగా కుదేలవుతోందో అర్థం చేసుకోవచ్చు.

  • ప్రపంచ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్​ కేసుల సంఖ్య: 5,085,066
  • మరణాల సంఖ్య: 329,721
  • కోలుకున్నవారు: 2,021,672

తొలినాళ్లలో చైనాను వణికించిన కొవిడ్‌.. తర్వాత ఐరోపా దేశాలను కుదిపేసింది. ఆపై అమెరికాలో విలయ తాండవం చేసింది. మృత్యు మృదంగాన్ని మోగించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ ఇప్పటివరకు దాదాపు 3.30 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అందులో 94 వేలకుపైగా మరణాలు అమెరికాలోనే సంభవించాయి. ప్రస్తుతం చైనా, అమెరికాతోపాటు ఐరోపావ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే రష్యా, బ్రెజిల్‌ తదితర దేశాల్లో దాని ఉద్ధృతి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రష్యాలో కేసుల సంఖ్య తాజాగా మూడు లక్షలు దాటింది. స్పెయిన్‌, ఇటలీ ఇటీవలి వరకు కరోనా దెబ్బకు కుదేలై.. ప్రస్తుతం కాస్త తేరుకుంటున్నాయి. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

బ్రెజిల్‌లో రికార్డు స్థాయి మరణాలు

బ్రెజిల్‌లో కొవిడ్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో 24 గంటల వ్యవధిలో 1,179 మంది ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది. ఇప్పటివరకు అక్కడ ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2.93 లక్షలు దాటింది.

ముప్పు తొలగకున్నా సడలింపులు

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ తొలినాళ్లలో లాక్‌డౌన్‌ మంత్రాన్ని జపించాయి. ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు విధించాయి. విద్యాసంస్థలను మూసివేశాయి. వ్యాపార కార్యకలాపాలన్నింటినీ ఆపేశాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిలువరించాయి. ఫలితంగా వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గినా.. పూర్తిస్థాయిలో మాత్రం అడ్డుకట్ట పడలేదు. నిషేధాజ్ఞలు సుదీర్ఘంగా సాగడంతో చాలా దేశాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాల్లో జనం లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతుండటంతో.. మరో దారి లేక పలు దేశాలు లాక్‌డౌన్‌లను సడలించాయి. ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేశాయి. దీంతో జనం మళ్లీ బయట తిరుగుతున్నారు. గుంపులుగా చేరుతున్నారు. ఫలితంగా ఇన్నాళ్లూ పడ్డ శ్రమ అంతా వృథా అయ్యే ముప్పుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటించకపోతే మళ్లీ వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని.. రెండో దశ విజృంభణ మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు.

రెండో దశ అనివార్యం

కరోనా రెండో దశ వ్యాప్తి అనివార్యమని ఐరోపా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం(ఈసీడీసీ) డైరెక్టర్‌ ఆండ్రియా అమ్మాన్‌ అభిప్రాయపడ్డారు. ఆ దశ ఎప్పుడు మొదలవుతుంది? ఎంత తీవ్రతతో విజృంభిస్తుంది? అన్నదే తేలాల్సి ఉందన్నారు. స్పెయిన్‌లో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 7 వరకు పొడిగించేందుకు పార్లమెంటు ఆమోదాన్ని ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌ కోరారు. మరోవైపు, దక్షిణ కొరియాలో పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి.

దాదాపు ఐదు నెలల క్రితం చైనాలో చిన్న నిప్పు రవ్వలా ఆవిర్భవించిన కరోనా మహమ్మారి కార్చిచ్చులా మారింది! రోజురోజుకూ తన ఉద్ధృతిని పెంచుకుంటూ మానవాళిని బెంబేలెత్తిస్తోంది. అమెరికా, బ్రిటన్‌, రష్యా సహా అనేక దేశాలు దాని ధాటికి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో అతలాకుతలమవుతున్నాయి. మానవాళి మొత్తానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటింది. అందులో 15 లక్షలకుపైగా బాధితులు ఒక్క అమెరికాలోనే ఉన్నారంటే కొవిడ్‌ దెబ్బకు అగ్రరాజ్యం ఎంతగా కుదేలవుతోందో అర్థం చేసుకోవచ్చు.

  • ప్రపంచ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్​ కేసుల సంఖ్య: 5,085,066
  • మరణాల సంఖ్య: 329,721
  • కోలుకున్నవారు: 2,021,672

తొలినాళ్లలో చైనాను వణికించిన కొవిడ్‌.. తర్వాత ఐరోపా దేశాలను కుదిపేసింది. ఆపై అమెరికాలో విలయ తాండవం చేసింది. మృత్యు మృదంగాన్ని మోగించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ ఇప్పటివరకు దాదాపు 3.30 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అందులో 94 వేలకుపైగా మరణాలు అమెరికాలోనే సంభవించాయి. ప్రస్తుతం చైనా, అమెరికాతోపాటు ఐరోపావ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే రష్యా, బ్రెజిల్‌ తదితర దేశాల్లో దాని ఉద్ధృతి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రష్యాలో కేసుల సంఖ్య తాజాగా మూడు లక్షలు దాటింది. స్పెయిన్‌, ఇటలీ ఇటీవలి వరకు కరోనా దెబ్బకు కుదేలై.. ప్రస్తుతం కాస్త తేరుకుంటున్నాయి. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

బ్రెజిల్‌లో రికార్డు స్థాయి మరణాలు

బ్రెజిల్‌లో కొవిడ్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో 24 గంటల వ్యవధిలో 1,179 మంది ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది. ఇప్పటివరకు అక్కడ ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2.93 లక్షలు దాటింది.

ముప్పు తొలగకున్నా సడలింపులు

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ తొలినాళ్లలో లాక్‌డౌన్‌ మంత్రాన్ని జపించాయి. ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు విధించాయి. విద్యాసంస్థలను మూసివేశాయి. వ్యాపార కార్యకలాపాలన్నింటినీ ఆపేశాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిలువరించాయి. ఫలితంగా వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గినా.. పూర్తిస్థాయిలో మాత్రం అడ్డుకట్ట పడలేదు. నిషేధాజ్ఞలు సుదీర్ఘంగా సాగడంతో చాలా దేశాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాల్లో జనం లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతుండటంతో.. మరో దారి లేక పలు దేశాలు లాక్‌డౌన్‌లను సడలించాయి. ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేశాయి. దీంతో జనం మళ్లీ బయట తిరుగుతున్నారు. గుంపులుగా చేరుతున్నారు. ఫలితంగా ఇన్నాళ్లూ పడ్డ శ్రమ అంతా వృథా అయ్యే ముప్పుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటించకపోతే మళ్లీ వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని.. రెండో దశ విజృంభణ మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు.

రెండో దశ అనివార్యం

కరోనా రెండో దశ వ్యాప్తి అనివార్యమని ఐరోపా వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్రం(ఈసీడీసీ) డైరెక్టర్‌ ఆండ్రియా అమ్మాన్‌ అభిప్రాయపడ్డారు. ఆ దశ ఎప్పుడు మొదలవుతుంది? ఎంత తీవ్రతతో విజృంభిస్తుంది? అన్నదే తేలాల్సి ఉందన్నారు. స్పెయిన్‌లో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 7 వరకు పొడిగించేందుకు పార్లమెంటు ఆమోదాన్ని ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌ కోరారు. మరోవైపు, దక్షిణ కొరియాలో పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.