ETV Bharat / international

Vaccine Mixing: ' రెండు వేర్వేరు టీకాలు కలిపితే అంతే!'

author img

By

Published : Jul 13, 2021, 10:50 AM IST

వేర్వేరు టీకాలను కలపడం(Vaccine Mixing) ప్రమాదకర పోకడ అని హెచ్చరించారు డబ్ల్యూహెచ్​ఓ(WHO) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్. అది ఇంకా ప్రయోగ దశలోనే ఉందని తెలిపారు.

mixing COVID-19 vaccines
WHO

వేర్వేరు తయారీ సంస్థల టీకాలను మిక్స్(Vaccine Mixing)​ చేయడమనేది 'ప్రమాదకర ధోరణి' అని హెచ్చరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. దాని వల్ల ప్రజల్లో గందరగోళం పెరుగుతుందని వారించారు. టీకా మిక్స్​ ప్రభావంపై పూర్తి సమాచారం అందుబాటులో లేదని వివరించారు.

"టీకాలు పుష్కలంగా అందుబాటులో ఉన్న దేశాల్లోని ప్రజలు.. ఏ టీకా తీసుకోవాలో స్వయంగా నిర్ణయించుకునే వైఖరి పెరిగింది. జాగ్రత్తగా ఉండండి. రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవడం ప్రమాదకరం. టీకా మిక్సింగ్​ ఫలితాలపై విశ్వసనీయ సమాచారం కానీ, సాక్ష్యాలు కానీ లేవు. వాటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పటివరకు వేచి ఉండండి."

-సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రవేత్త

టీకా ప్రాధాన్యత..

రెండు లేదా మూడో, నాలుగో డోసు ఎప్పుడు తీసుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటే గందరగోళం ఏర్పడుతుందని స్వామినాథన్ చెప్పారు. "నాలుగు దేశాలు బూస్టర్​ డోసు కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఇంకొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మధ్యాదాయ, సంపన్న దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసు ఇవ్వాలంటే అదనంగా 80 కోట్ల టీకాలు అవసరం అవుతాయి. కానీ, ఇప్పటికీ.. కనీసం ఫ్రంట్​లైన్, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు టీకాలు ఇవ్వని దేశాలు కూడా ఉన్నాయి. టీకా ప్రాధాన్యతా క్రమంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది" అని స్వామినాథన్ తెలిపారు.

ఇదీ చూడండి: ఆ మిశ్రమ డోసుల ప్రభావం ఎక్కువే!

వేర్వేరు తయారీ సంస్థల టీకాలను మిక్స్(Vaccine Mixing)​ చేయడమనేది 'ప్రమాదకర ధోరణి' అని హెచ్చరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. దాని వల్ల ప్రజల్లో గందరగోళం పెరుగుతుందని వారించారు. టీకా మిక్స్​ ప్రభావంపై పూర్తి సమాచారం అందుబాటులో లేదని వివరించారు.

"టీకాలు పుష్కలంగా అందుబాటులో ఉన్న దేశాల్లోని ప్రజలు.. ఏ టీకా తీసుకోవాలో స్వయంగా నిర్ణయించుకునే వైఖరి పెరిగింది. జాగ్రత్తగా ఉండండి. రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవడం ప్రమాదకరం. టీకా మిక్సింగ్​ ఫలితాలపై విశ్వసనీయ సమాచారం కానీ, సాక్ష్యాలు కానీ లేవు. వాటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పటివరకు వేచి ఉండండి."

-సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్​ఓ శాస్త్రవేత్త

టీకా ప్రాధాన్యత..

రెండు లేదా మూడో, నాలుగో డోసు ఎప్పుడు తీసుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటే గందరగోళం ఏర్పడుతుందని స్వామినాథన్ చెప్పారు. "నాలుగు దేశాలు బూస్టర్​ డోసు కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఇంకొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మధ్యాదాయ, సంపన్న దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసు ఇవ్వాలంటే అదనంగా 80 కోట్ల టీకాలు అవసరం అవుతాయి. కానీ, ఇప్పటికీ.. కనీసం ఫ్రంట్​లైన్, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు టీకాలు ఇవ్వని దేశాలు కూడా ఉన్నాయి. టీకా ప్రాధాన్యతా క్రమంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది" అని స్వామినాథన్ తెలిపారు.

ఇదీ చూడండి: ఆ మిశ్రమ డోసుల ప్రభావం ఎక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.