ETV Bharat / international

'జాన్సన్​.. పాక్​లో మైనార్టీలను కాపాడండి' - పాక్​ మైనారిటీ హింసపై బ్రిటన్​ హిందు సంఘాలు

పాకిస్థాన్​లో జరుగుతున్న మైనారిటీ హింసపై చొరవ తీసుకోవాలని కోరుతూ బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు బ్రిటీష్​ హిందూ సంఘాలు లేఖ రాశాయి. ప్రజాస్యామ్య దేశాలతో కలిసి పాక్​పై విచారణ జరిపించాలని కోరాయి. పాక్​లోని ఖైబర్​ పంఖ్తుంక్వా రాష్ట్రంలో హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన ఘటన మైనారిటీ హింసకు సాక్ష్యమని ఉదహరించాయి.

British Hindus seek Boris Johnson intervention over Pak minority persecution
పాక్​లోమైనారిటీ హింసపై బోరిస్​ జాన్సన్​ చొరవ కోరుతూ లేఖ
author img

By

Published : Jan 11, 2021, 11:52 AM IST

పాకిస్థాన్​ మైనారిటీ హింసపై చొరవ తీసుకోవాలని కోరుతూ బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు బ్రిటీష్​ హిందూ సంఘాలు లేఖ రాశాయి. పాక్​లో హిందువులు తీవ్రమైన హింసకు గురవుతున్నారని వివరిస్తూ ఇటీవల ఆదేశంలోని ఖైబర్​ పంఖ్తుంక్వా రాష్ట్రంలో హిందూ దేవాలయాన్ని దగ్ధం చేసిన ఘటనను ఉదహరించాయి.

పాకిస్థాన్​లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేవిధంగా పాక్​ ప్రధానిపై ఒత్తిడి తెచ్చే చర్యలు తీసుకోవాలని ప్రధాని బోరిస్​ జాన్సన్​ను కోరుతున్నాం. ఇటీవల పాక్​లో హిందువుల పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. ఖైబర్​ పంఖ్తుంక్వా దేవాలయ ఘటనపై ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రజాస్వామ్యదేశాలతో కలిసి బ్రిటన్​ ముందుండి విచారణ జరిపించాలని వేడుకుంటున్నాం.

- బ్రిటీష్​ హిందూ సంఘాలు

పాకిస్థాన్​లోని ఖైబర్​ పంఖ్తుంక్వా ఘటనపై ప్రపంచ మీడియా మౌనం వహించడంపై హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో మీడియా విఫలమైందని లేఖలో పేర్కొన్నాయి. పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​లో హిందూ దేవాలయ నిర్మాణానికి ఎదురైన వ్యతిరేకతను ప్రస్తావించాయి. పాక్​ ఉన్నతాధికారుల వివాదాస్పద వ్యాఖ్యలను లేఖలో జతచేశాయి. కేవలం హిందువులే కాకుండా క్రైస్తవులు సైతం బాధితులుగా ఉన్నారని లేఖలో విన్నవించాయి.

పాక్​లో ఖైబర్​ పంఖ్తుంక్వా రాష్ట్రంలో డిసెంబర్ 30న హిందూ దేవాలయాన్ని దుండగులు కూల్చివేశారు. శిథిలమైన దేవాలయానికి మరమ్మతు పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి:క్యాపిటల్​పై దాడిని ఖండిస్తూ దౌత్య అధికారుల తీర్మానం

పాకిస్థాన్​ మైనారిటీ హింసపై చొరవ తీసుకోవాలని కోరుతూ బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు బ్రిటీష్​ హిందూ సంఘాలు లేఖ రాశాయి. పాక్​లో హిందువులు తీవ్రమైన హింసకు గురవుతున్నారని వివరిస్తూ ఇటీవల ఆదేశంలోని ఖైబర్​ పంఖ్తుంక్వా రాష్ట్రంలో హిందూ దేవాలయాన్ని దగ్ధం చేసిన ఘటనను ఉదహరించాయి.

పాకిస్థాన్​లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేవిధంగా పాక్​ ప్రధానిపై ఒత్తిడి తెచ్చే చర్యలు తీసుకోవాలని ప్రధాని బోరిస్​ జాన్సన్​ను కోరుతున్నాం. ఇటీవల పాక్​లో హిందువుల పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. ఖైబర్​ పంఖ్తుంక్వా దేవాలయ ఘటనపై ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రజాస్వామ్యదేశాలతో కలిసి బ్రిటన్​ ముందుండి విచారణ జరిపించాలని వేడుకుంటున్నాం.

- బ్రిటీష్​ హిందూ సంఘాలు

పాకిస్థాన్​లోని ఖైబర్​ పంఖ్తుంక్వా ఘటనపై ప్రపంచ మీడియా మౌనం వహించడంపై హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో మీడియా విఫలమైందని లేఖలో పేర్కొన్నాయి. పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​లో హిందూ దేవాలయ నిర్మాణానికి ఎదురైన వ్యతిరేకతను ప్రస్తావించాయి. పాక్​ ఉన్నతాధికారుల వివాదాస్పద వ్యాఖ్యలను లేఖలో జతచేశాయి. కేవలం హిందువులే కాకుండా క్రైస్తవులు సైతం బాధితులుగా ఉన్నారని లేఖలో విన్నవించాయి.

పాక్​లో ఖైబర్​ పంఖ్తుంక్వా రాష్ట్రంలో డిసెంబర్ 30న హిందూ దేవాలయాన్ని దుండగులు కూల్చివేశారు. శిథిలమైన దేవాలయానికి మరమ్మతు పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి:క్యాపిటల్​పై దాడిని ఖండిస్తూ దౌత్య అధికారుల తీర్మానం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.