ETV Bharat / international

కరోనా కట్టడికి కొత్త వ్యూహాలు -హాట్​స్పాట్లే లక్ష్యంగా ఆంక్షలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు. అయితే ఈసారి దేశవ్యాప్త లాక్​డౌన్​ కాకుండా కేసులు అధికంగా ఉండే హాట్​స్పాట్లకే ఆంక్షలను పరిమితం చేస్తున్నాయి. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న యూరప్​, అమెరికా దేశాలు ఈ విధానాన్నే అమలు చేస్తున్నాయి.

author img

By

Published : Oct 19, 2020, 5:11 PM IST

As virus flares globally, new strategies target hot spots
కరోనా కట్టడికి కొత్త వ్యూహాలు..హాట్​స్పాట్లే లక్ష్యంగా ఆంక్షలు

కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో కఠిన ఆంక్షలు అమలు చేశాయి ప్రపంచ దేశాలు. వైరస్​ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్​డౌన్​లు విధించాయి. సరిహద్దులు మూసివేశాయి. ప్రయాణాలు నిషేధించాయి. ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈసారి కొత్త వ్యూహాలు రూపొందిస్తున్నాయి. దేశవ్యాప్త లాక్​డౌన్​ కాకుండా వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న హాట్​స్పాట్​ కేంద్రాలకే ఆంక్షలను పరిమితం చేస్తున్నాయి. కొత్త కేసులు అధికంగా నమోదవుతున్న యూరప్​, అమెరికా దేశాలు ఈ విధానాన్నే పాటిస్తున్నాయి. లాక్​డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఎంతటి తీవ్ర ప్రభావం ఉంటుందో తెలిశాక ఈ కొత్త వ్యూహాల రూపొందిస్తున్నాయి.

  • అమెరికాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న న్యూయార్క్​లోని హాట్​స్పాట్​ కేంద్రాలలో పాఠశాలలు, వ్యాపారాలు మూసివేశారు. చట్టుపక్కల రెండు చదరపు మైళ్ల వరకే ఆంక్షలను పరిమితం చేశారు.
  • స్పెయిన్ రాజధాని మాడ్రిడ్​లోని పలు ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలు విధించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలకే నిబంధలను పరిమితం చేశారు.
  • ఇటలీలో పలు భవనాలను మాత్రమే క్వారంటైన్​లో ఉంచారు.
  • ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్ మాత్రం దేశవ్యాప్త లాక్​డౌన్ విధించాయి. ఇతర దేశాలు మాత్రం టెస్టింగ్, ట్రేసింగ్​తో పాటు పలు నగరాలకే లాక్​డౌన్​ను​ పరిమితం చేయాలని భావిస్తున్నాయి.
  • కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ వ్యాప్తంగా రెండు వారాల పాటు లాక్​డౌన్ విధించాలని నిపుణులు సూచించారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడు విధానాల లాక్​డౌన్​ను అమలు చేస్తోంది. కేసులు తీవ్రత ఆధారంగా ఆంక్షలు విధిస్తోంది.

కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో కఠిన ఆంక్షలు అమలు చేశాయి ప్రపంచ దేశాలు. వైరస్​ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్​డౌన్​లు విధించాయి. సరిహద్దులు మూసివేశాయి. ప్రయాణాలు నిషేధించాయి. ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈసారి కొత్త వ్యూహాలు రూపొందిస్తున్నాయి. దేశవ్యాప్త లాక్​డౌన్​ కాకుండా వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న హాట్​స్పాట్​ కేంద్రాలకే ఆంక్షలను పరిమితం చేస్తున్నాయి. కొత్త కేసులు అధికంగా నమోదవుతున్న యూరప్​, అమెరికా దేశాలు ఈ విధానాన్నే పాటిస్తున్నాయి. లాక్​డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఎంతటి తీవ్ర ప్రభావం ఉంటుందో తెలిశాక ఈ కొత్త వ్యూహాల రూపొందిస్తున్నాయి.

  • అమెరికాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న న్యూయార్క్​లోని హాట్​స్పాట్​ కేంద్రాలలో పాఠశాలలు, వ్యాపారాలు మూసివేశారు. చట్టుపక్కల రెండు చదరపు మైళ్ల వరకే ఆంక్షలను పరిమితం చేశారు.
  • స్పెయిన్ రాజధాని మాడ్రిడ్​లోని పలు ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలు విధించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలకే నిబంధలను పరిమితం చేశారు.
  • ఇటలీలో పలు భవనాలను మాత్రమే క్వారంటైన్​లో ఉంచారు.
  • ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్ మాత్రం దేశవ్యాప్త లాక్​డౌన్ విధించాయి. ఇతర దేశాలు మాత్రం టెస్టింగ్, ట్రేసింగ్​తో పాటు పలు నగరాలకే లాక్​డౌన్​ను​ పరిమితం చేయాలని భావిస్తున్నాయి.
  • కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ వ్యాప్తంగా రెండు వారాల పాటు లాక్​డౌన్ విధించాలని నిపుణులు సూచించారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడు విధానాల లాక్​డౌన్​ను అమలు చేస్తోంది. కేసులు తీవ్రత ఆధారంగా ఆంక్షలు విధిస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.