ETV Bharat / international

భారత్​ విమానాలపై మరో రెండు దేశాల ఆంక్షలు - విమానయాన సంస్థలు

భారత్​లో కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో విమానాలపై ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు. ఇప్పటికే ఫ్రాన్స్​, బ్రిటన్​ నిషేధం విధించగా.. యూఏఈ, ఆస్ట్రేలియాలు ఆ జాబితాలో చేరాయి. మరోవైపు.. దేశీయ సేవలపైనా కరోనా ప్రభావం పడింది. కోల్​కతా, షిల్లాంగ్​ మధ్య విమానాలు నిలిపివేసింది ఇండిగో.

Flights from India
భారత్​ విమానాలపై మరిన్ని దేశాల ఆంక్షలు
author img

By

Published : Apr 22, 2021, 10:41 PM IST

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ.. భారత్​ నుంచి వెళ్లే ప్రయాణికులపై ఇప్పటికే ఫ్రాన్స్​, బ్రిటన్​ వంటి దేశాలు ఆంక్షలు విధించాయి. ఆ జాబితాలో మరిన్ని దేశాలు చేశారు. భారత్​ నుంచి దుబాయ్​ మధ్య తిరిగే.. అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది యూఏఈ. ఏప్రిల్​ 24 శుక్రవారం అర్ధరాత్రి నుంచి.. 10 రోజుల పాటు అన్ని తరగతుల విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అరబ్​ ఎమిరెట్స్​ ప్రకటన విడుదల చేసింది. గత 14 రోజుల్లో భారత్​కు వచ్చిన వారు సైతం ఇతర దేశాల నుంచీ రాకుండా ఆంక్షలు విధించింది. అయితే.. దుబాయ్​ నుంచి భారత్​కు వచ్చే విమానాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలులకు మినాహాయింపునిచ్చింది.

విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు..

భారత్​ వంటి కొవిడ్​తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల నుంచి విమానాల రాకపోకలను తగ్గించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ ప్రకటించారు. ఆయా దేశాల నుంచి 30 శాతం మేర విమానాలను రద్దు చేయనున్నట్లు కేబినెట్​ భేటీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే.. కరోనా ఉద్ధృతి ఉన్న దేశాలకు వెళ్లే ఆస్ట్రేలియా పౌరులపైనా ఆంక్షలు ఉంటాయన్నారు. 14 రోజుల క్రితం ఆయా దేశాల్లో పర్యటిస్తే.. విమానం ఎక్కే 72 గంటల ముందే పీసీఆర్​ టెస్ట్​ చేయించుకోవాలన్నారు.

అదనపు ఫ్లైట్స్​కు నో..

ఇప్పటికే భారత్​ను 'రెడ్​ లిస్ట్'​లో పెట్టింది బ్రిటన్​. భారత్​ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్​ రెడ్​ లిస్ట్​లో ఉన్న కారణంగా అదనపు విమానాలకు నిరాకరించింది లండన్​లోని హీత్రోవ్​ విమానాశ్రయం. భారత్​ నుంచి 8 అదనపు విమానాలను అనుమతించాలని నాలుగు విమానయాన సంస్థలు చేసిన వినతిని తోసిపుచ్చింది. విమానాశ్రయంలో ఎక్కువ జనం గుమిగూడకుండా, పాస్​పోర్ట్​ తనిఖీ కేంద్రాల వద్ద బారులు తీరకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు విమానాశ్రయ అధికారులు.

కోల్​కతా-షిల్లాంగ్​ మధ్య బంద్​

కోల్​కతా-షిల్లాంగ్​ మధ్య రోజువారీ విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది ఇండిగో సంస్థ. శుక్రవారం నుంచి 8 రోజుల పాటు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే.. విమాన సంస్థ కారణం వెల్లడించకపోయినప్పటికీ, కొవిడ్​-19 పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షిల్లాంగ్​ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

బ్రీత్​ అనలైజర్​ టెస్ట్​లు తొలగించాలి..

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విమానయాన సిబ్బందికి బ్రీత్​ అనలైజర్​ పరీక్షలను తక్షణమే నిలిపివేయాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏను కోరింది పైలట్ల సంఘం(ఎఫ్​ఐపీ). ఈ యంత్రాలు తరుచుగా ఎక్కువగా ఉపయోగించటం ద్వారా ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్​ సోకే ప్రమాదం ఉందని పౌర విమానయాన డైరెక్టర్​ జనరల్​ అరుణ్​ కుమార్​కు లేఖ రేసింది.

ఇదీ చూడండి: జలాంతర్గామి కోసం గాలింపు- రంగంలోకి భారత్

భారత్‌ ప్రయాణికులపై ఫ్రాన్స్‌ ఆంక్షలు!

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ.. భారత్​ నుంచి వెళ్లే ప్రయాణికులపై ఇప్పటికే ఫ్రాన్స్​, బ్రిటన్​ వంటి దేశాలు ఆంక్షలు విధించాయి. ఆ జాబితాలో మరిన్ని దేశాలు చేశారు. భారత్​ నుంచి దుబాయ్​ మధ్య తిరిగే.. అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది యూఏఈ. ఏప్రిల్​ 24 శుక్రవారం అర్ధరాత్రి నుంచి.. 10 రోజుల పాటు అన్ని తరగతుల విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అరబ్​ ఎమిరెట్స్​ ప్రకటన విడుదల చేసింది. గత 14 రోజుల్లో భారత్​కు వచ్చిన వారు సైతం ఇతర దేశాల నుంచీ రాకుండా ఆంక్షలు విధించింది. అయితే.. దుబాయ్​ నుంచి భారత్​కు వచ్చే విమానాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలులకు మినాహాయింపునిచ్చింది.

విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు..

భారత్​ వంటి కొవిడ్​తో తీవ్రంగా ప్రభావితమైన దేశాల నుంచి విమానాల రాకపోకలను తగ్గించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​ ప్రకటించారు. ఆయా దేశాల నుంచి 30 శాతం మేర విమానాలను రద్దు చేయనున్నట్లు కేబినెట్​ భేటీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే.. కరోనా ఉద్ధృతి ఉన్న దేశాలకు వెళ్లే ఆస్ట్రేలియా పౌరులపైనా ఆంక్షలు ఉంటాయన్నారు. 14 రోజుల క్రితం ఆయా దేశాల్లో పర్యటిస్తే.. విమానం ఎక్కే 72 గంటల ముందే పీసీఆర్​ టెస్ట్​ చేయించుకోవాలన్నారు.

అదనపు ఫ్లైట్స్​కు నో..

ఇప్పటికే భారత్​ను 'రెడ్​ లిస్ట్'​లో పెట్టింది బ్రిటన్​. భారత్​ నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్​ రెడ్​ లిస్ట్​లో ఉన్న కారణంగా అదనపు విమానాలకు నిరాకరించింది లండన్​లోని హీత్రోవ్​ విమానాశ్రయం. భారత్​ నుంచి 8 అదనపు విమానాలను అనుమతించాలని నాలుగు విమానయాన సంస్థలు చేసిన వినతిని తోసిపుచ్చింది. విమానాశ్రయంలో ఎక్కువ జనం గుమిగూడకుండా, పాస్​పోర్ట్​ తనిఖీ కేంద్రాల వద్ద బారులు తీరకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు విమానాశ్రయ అధికారులు.

కోల్​కతా-షిల్లాంగ్​ మధ్య బంద్​

కోల్​కతా-షిల్లాంగ్​ మధ్య రోజువారీ విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది ఇండిగో సంస్థ. శుక్రవారం నుంచి 8 రోజుల పాటు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే.. విమాన సంస్థ కారణం వెల్లడించకపోయినప్పటికీ, కొవిడ్​-19 పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షిల్లాంగ్​ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

బ్రీత్​ అనలైజర్​ టెస్ట్​లు తొలగించాలి..

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విమానయాన సిబ్బందికి బ్రీత్​ అనలైజర్​ పరీక్షలను తక్షణమే నిలిపివేయాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏను కోరింది పైలట్ల సంఘం(ఎఫ్​ఐపీ). ఈ యంత్రాలు తరుచుగా ఎక్కువగా ఉపయోగించటం ద్వారా ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్​ సోకే ప్రమాదం ఉందని పౌర విమానయాన డైరెక్టర్​ జనరల్​ అరుణ్​ కుమార్​కు లేఖ రేసింది.

ఇదీ చూడండి: జలాంతర్గామి కోసం గాలింపు- రంగంలోకి భారత్

భారత్‌ ప్రయాణికులపై ఫ్రాన్స్‌ ఆంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.