ETV Bharat / international

ఇమ్రాన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల భారీ ర్యాలీ - ఇమ్రాన్ ఖాన్​కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి పాకిస్థాన్ ప్రతిపక్షాలు

పాకిస్థాన్​లో ప్రతిపక్ష పార్టీలన్ని ఏకతాటిపైకి వచ్చి ఏర్పడిన పీడీఎం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కు వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇందులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వీడియో ద్వారా ప్రసంగించారు.

anti-government protest in Pakistan
ఇమ్రాన్ ఖాన్​కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ
author img

By

Published : Oct 17, 2020, 8:15 AM IST

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించాయి. గుజ్రన్​వాలాలో జరిగిన ఈ ర్యాలీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలంతా పాల్గొన్నారు.

దేశంలో అమయాక ప్రజలపై సైన్యం జరుపుతున్న దాడులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అవినీతిలో కూరుకుపోయిన ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని నినదించాయి. పాకిస్థాన్​లో ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన ర్యాలీకి పెద్దఎత్తున ప్రజలు మద్ధతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా.. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ర్యాలీలో పాల్గొన్నారు. తనను ప్రధాని బాధ్యతల నుంచి తప్పించి.. ఇమ్రాన్​ ఖాన్​కు పగ్గాలు అప్పగించడం వెనుక రక్షణ శాఖ ప్రమేయం ఉందని షరీఫ్ తన ప్రసంగంలో ఆరోపించారు.

ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలూ ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరిన్ని ఇతర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో 11 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిన పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్​మెంట్​ (పీడీఎం)ల ఆధ్వర్యంలో జరిగిన మొదటి ర్యాలీ ఇది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, జమియత్ ఉలెమా-ఇ-ఇస్లాం-ఫజల్​లు ఈ కూటమిలో ప్రధానంగా ఉన్నాయి.

ఇదీ చూడండి:థాయ్ ప్రధానికి నిరసనల సెగ- రాజీనామాకు ససేమిరా

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించాయి. గుజ్రన్​వాలాలో జరిగిన ఈ ర్యాలీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలంతా పాల్గొన్నారు.

దేశంలో అమయాక ప్రజలపై సైన్యం జరుపుతున్న దాడులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అవినీతిలో కూరుకుపోయిన ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని నినదించాయి. పాకిస్థాన్​లో ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన ర్యాలీకి పెద్దఎత్తున ప్రజలు మద్ధతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సందర్భంగా.. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ర్యాలీలో పాల్గొన్నారు. తనను ప్రధాని బాధ్యతల నుంచి తప్పించి.. ఇమ్రాన్​ ఖాన్​కు పగ్గాలు అప్పగించడం వెనుక రక్షణ శాఖ ప్రమేయం ఉందని షరీఫ్ తన ప్రసంగంలో ఆరోపించారు.

ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలూ ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరిన్ని ఇతర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో 11 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిన పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్​మెంట్​ (పీడీఎం)ల ఆధ్వర్యంలో జరిగిన మొదటి ర్యాలీ ఇది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, జమియత్ ఉలెమా-ఇ-ఇస్లాం-ఫజల్​లు ఈ కూటమిలో ప్రధానంగా ఉన్నాయి.

ఇదీ చూడండి:థాయ్ ప్రధానికి నిరసనల సెగ- రాజీనామాకు ససేమిరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.