ETV Bharat / international

11 తీవ్రవాద సంస్థలపై ఆ దేశం నిషేధం

author img

By

Published : Apr 14, 2021, 12:07 PM IST

11 ఉగ్రవాద సంస్థలను నిషేధిస్తూ శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో జరిగిన తీవ్రవాద ఘటనల్లో వారి హస్తం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిషేధిత జాబితాలో ఐఎస్​ఐఎస్, అల్​ ఖైదా లాంటి సంస్థలు ఉన్నాయి.

srilanka bans extremist groups
11 తీవ్రవాద సంస్థలు శ్రీలంక నిషేధం

శ్రీలంక ప్రభుత్వం 11 తీవ్రవాద సంస్థలను నిషేధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు అధ్యక్షుడు గోటబయా రాజపక్సా ప్రత్యేక గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 10 నుంచి 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తామని నోటిఫికేషన్​లో స్పష్టం చేశారు.

గతంలో శ్రీలంకలో జరిగిన తీవ్రవాద ఘటనల్లో ఆయా సంస్థల హస్తం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితాలో ఐస్​ఐస్​, అల్​ ఖైదా లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో స్థానిక ముస్లిం సంస్థలు సైతం ఉండటం గమనార్హం.

ఐసిస్​తో సంబంధాలున్న ఇస్లామిస్ట్ ఉగ్రసంస్థ నేషనల్ థవీద్ జమాత్​కు చెందిన ఉగ్రవాదులు.. గత ఏడాది ఈస్టర్ వేడుకల వేళ శ్రీలంకలోని రద్దీగా ఉండే చర్చ్​లు, హోటళ్లు లక్ష్యంగా 9 వరుస బాంబు పేలుళ్లకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 270 మంది ప్రాణాలు విడిచారు. ఇందులో 9 మంది భారతీయులు కూడా ఉన్నారు.

ఇదీ చదవండి : కుంభమేళా: భక్తులతో కిక్కిరిసిన హరిద్వార్​

'రంజాన్‌ ఉపవాసంతోనూ కరోనా టీకా తీసుకోవచ్చు'

శ్రీలంక ప్రభుత్వం 11 తీవ్రవాద సంస్థలను నిషేధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు అధ్యక్షుడు గోటబయా రాజపక్సా ప్రత్యేక గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 10 నుంచి 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తామని నోటిఫికేషన్​లో స్పష్టం చేశారు.

గతంలో శ్రీలంకలో జరిగిన తీవ్రవాద ఘటనల్లో ఆయా సంస్థల హస్తం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధిత జాబితాలో ఐస్​ఐస్​, అల్​ ఖైదా లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో స్థానిక ముస్లిం సంస్థలు సైతం ఉండటం గమనార్హం.

ఐసిస్​తో సంబంధాలున్న ఇస్లామిస్ట్ ఉగ్రసంస్థ నేషనల్ థవీద్ జమాత్​కు చెందిన ఉగ్రవాదులు.. గత ఏడాది ఈస్టర్ వేడుకల వేళ శ్రీలంకలోని రద్దీగా ఉండే చర్చ్​లు, హోటళ్లు లక్ష్యంగా 9 వరుస బాంబు పేలుళ్లకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 270 మంది ప్రాణాలు విడిచారు. ఇందులో 9 మంది భారతీయులు కూడా ఉన్నారు.

ఇదీ చదవండి : కుంభమేళా: భక్తులతో కిక్కిరిసిన హరిద్వార్​

'రంజాన్‌ ఉపవాసంతోనూ కరోనా టీకా తీసుకోవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.