ETV Bharat / international

పాఠశాలపై రష్యా బాంబు దాడి- 400 మంది బాధితులు!

russia bomb attack on school
పాఠశాలపై రష్యా బాంబు దాడి
author img

By

Published : Mar 20, 2022, 1:13 PM IST

Updated : Mar 20, 2022, 2:31 PM IST

13:07 March 20

పాఠశాలపై రష్యా బాంబు దాడి- 400 మంది బాధితులు!

Russia bomb attack on school: మరియుపోల్​ నగరంలోని ఆర్ట్​ స్కూల్​పై రష్యా సైన్యం బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఆ బడిలో దాదాపు 400 మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. అయితే.. దాడి తర్వాత వారి పరిస్థితిపై స్పష్టత ఇవ్వలేదు.

రష్యా సైన్యం బాంబు దాడిలో పాఠశాల పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద కొందరు ప్రజలు ఉండొచ్చని చెప్పారు.

పౌరులు ఆశ్రయం పొందుతున్న ఓ థియేటర్​ పైన కూడా రష్యా బలగాలు మరియుపోల్‌లో బాంబు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 130 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా కొందరు ఉండవచ్చని అన్నారు. ఉక్రెయిన్​కు వ్యూహాత్మక నౌకాశ్రయాన్ని కూడా రష్యా దళాలు చుట్టుముట్టాయి. ఆహారం, మంచినీటి సరఫరాలను నిలిపివేశాయి. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​ స్కీ స్పందించారు. యుద్ధ నేరాల్లో మరియుపోల్ ముట్టడి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

మరోసారి హైపర్​ సోనిక్​ క్షిపణులను ప్రయోగించిన రష్యా..

ఉక్రెయిన్‌పై సైనిక దాడులను ఉద్ధృతం చేస్తున్న రష్యా వరసగా రెండో రోజూ హైపర్‌ సోనిక్ క్షిపణితో విరుచుకుపడింది. శనివారం ఉక్రెయిన్ ఆయుధాగారంపై కింజల్ క్షిపణిని ఎక్కుపెట్టిన పుతిన్‌ సైన్యం ఆదివారం మైకోలైవ్‌ పోర్టు సమీపంలోని చమురు డిపోను లక్ష్యంగా చేసుకుంది. దీనితో పాటు నల్ల సముద్రం, కాస్పియన్​, సముద్రంలోని తమ నౌకల నుంచి ఉక్రెయిన్​ పై దాడులు చేసినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్​ కొనాషెంకోవ్​ తెలిపారు. తొలిసారి ఈ సరికొత్త క్షిపణులను పశ్చిమ ఇవానో- ఫ్రాంకివ్స్క్​ ప్రాంతంలోని భారీ భూగర్భ ఆయుధాగారంపై సంధించినట్లు రష్యా శనివారం ప్రకటించింది.

13:07 March 20

పాఠశాలపై రష్యా బాంబు దాడి- 400 మంది బాధితులు!

Russia bomb attack on school: మరియుపోల్​ నగరంలోని ఆర్ట్​ స్కూల్​పై రష్యా సైన్యం బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఆ బడిలో దాదాపు 400 మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. అయితే.. దాడి తర్వాత వారి పరిస్థితిపై స్పష్టత ఇవ్వలేదు.

రష్యా సైన్యం బాంబు దాడిలో పాఠశాల పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద కొందరు ప్రజలు ఉండొచ్చని చెప్పారు.

పౌరులు ఆశ్రయం పొందుతున్న ఓ థియేటర్​ పైన కూడా రష్యా బలగాలు మరియుపోల్‌లో బాంబు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 130 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా కొందరు ఉండవచ్చని అన్నారు. ఉక్రెయిన్​కు వ్యూహాత్మక నౌకాశ్రయాన్ని కూడా రష్యా దళాలు చుట్టుముట్టాయి. ఆహారం, మంచినీటి సరఫరాలను నిలిపివేశాయి. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​ స్కీ స్పందించారు. యుద్ధ నేరాల్లో మరియుపోల్ ముట్టడి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

మరోసారి హైపర్​ సోనిక్​ క్షిపణులను ప్రయోగించిన రష్యా..

ఉక్రెయిన్‌పై సైనిక దాడులను ఉద్ధృతం చేస్తున్న రష్యా వరసగా రెండో రోజూ హైపర్‌ సోనిక్ క్షిపణితో విరుచుకుపడింది. శనివారం ఉక్రెయిన్ ఆయుధాగారంపై కింజల్ క్షిపణిని ఎక్కుపెట్టిన పుతిన్‌ సైన్యం ఆదివారం మైకోలైవ్‌ పోర్టు సమీపంలోని చమురు డిపోను లక్ష్యంగా చేసుకుంది. దీనితో పాటు నల్ల సముద్రం, కాస్పియన్​, సముద్రంలోని తమ నౌకల నుంచి ఉక్రెయిన్​ పై దాడులు చేసినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్​ కొనాషెంకోవ్​ తెలిపారు. తొలిసారి ఈ సరికొత్త క్షిపణులను పశ్చిమ ఇవానో- ఫ్రాంకివ్స్క్​ ప్రాంతంలోని భారీ భూగర్భ ఆయుధాగారంపై సంధించినట్లు రష్యా శనివారం ప్రకటించింది.

Last Updated : Mar 20, 2022, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.