ETV Bharat / international

వ్యాన్​పై బాంబు దాడి- నలుగురు లెక్చరర్లు మృతి

అఫ్గానిస్థాన్​ ఉత్తర కపీసాలో మినీ వ్యాన్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు లెక్చరర్లు మృతిచెందారు.

author img

By

Published : May 29, 2021, 8:12 PM IST

Updated : May 29, 2021, 8:36 PM IST

bomb blast
అఫ్గాన్ బాంబు దాడి

అఫ్గాన్​లో మినీ వ్యాన్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు లెక్చరర్లు మృతిచెందారు. 11 మంది విద్యార్ధులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఉత్తర కపీసా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

దాడిలో దుండగులు రిమోట్​ కంట్రోల్​తో పనిచేసే బాంబు అమర్చినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. అల్బరోని యూనివర్సిటీ వైపుగా వెళ్తుండగా వ్యాన్​పై దాడి జరిగినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారకులెవరనేదానిపై స్పష్టత రాలేదు.

గతంలో పలుమార్లు కాబుల్ యూనివర్సిటీపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్​ వారు ఇదే తరహాలో బాంబు దాడికి పాల్పడ్డారు.

ఇదీ చదవండి:చైనా కమ్యునిస్టు పార్టీ 'వందేళ్ల' వేడుకలు

అఫ్గాన్​లో మినీ వ్యాన్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు లెక్చరర్లు మృతిచెందారు. 11 మంది విద్యార్ధులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఉత్తర కపీసా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

దాడిలో దుండగులు రిమోట్​ కంట్రోల్​తో పనిచేసే బాంబు అమర్చినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. అల్బరోని యూనివర్సిటీ వైపుగా వెళ్తుండగా వ్యాన్​పై దాడి జరిగినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారకులెవరనేదానిపై స్పష్టత రాలేదు.

గతంలో పలుమార్లు కాబుల్ యూనివర్సిటీపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్​ వారు ఇదే తరహాలో బాంబు దాడికి పాల్పడ్డారు.

ఇదీ చదవండి:చైనా కమ్యునిస్టు పార్టీ 'వందేళ్ల' వేడుకలు

Last Updated : May 29, 2021, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.