ETV Bharat / international

జపాన్​లో భూకంపం..  రిక్టర్​ స్కేల్​పై 6.9 తీవ్రత నమోదు

author img

By

Published : Apr 18, 2020, 8:37 PM IST

జపాన్ దక్షిణ టోక్యోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు​పై దీని తీవ్రత 6.9గా నమోదైంది. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.

Quake hits off islands south of Tokyo; no tsunami
6.9 తీవ్రతతో జపాన్​లో భారీ భూకంపం..

జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని టోక్యోకు 1000 కిలోమీటర్ల దూరంలోని ఓగాసవరా ద్వీపంలో రిక్టర్​ స్కేలుపై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి.

సముద్ర మట్టానికి 450 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపిన అధికారులు.. దీని వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.

సముద్ర పర్వతాలతో ఏర్పడిన ఈ ద్వీపాన్ని బోనిన్​ ద్వీపమని కూడా పిలుస్తారు. ఈ ద్వీపం యునెస్కో గుర్తింపు పొందింది.

జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని టోక్యోకు 1000 కిలోమీటర్ల దూరంలోని ఓగాసవరా ద్వీపంలో రిక్టర్​ స్కేలుపై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి.

సముద్ర మట్టానికి 450 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపిన అధికారులు.. దీని వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.

సముద్ర పర్వతాలతో ఏర్పడిన ఈ ద్వీపాన్ని బోనిన్​ ద్వీపమని కూడా పిలుస్తారు. ఈ ద్వీపం యునెస్కో గుర్తింపు పొందింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.