ETV Bharat / international

చైనా నుంచి పాక్​కు 5 లక్షల కరోనా టీకా డోసులు

పొరుగుదేశం పాకిస్థాన్​కు కరోనా టీకాను సరఫరా చేసింది చైనా. ఒప్పందంలో భాగంగా తొలి విడతగా 5 లక్షల టీకా డోసులను ఉచితంగానే అందించింది చైనా. ఈ వారాంతంలోనే వ్యాక్సినేషన్​ను ప్రారంభించనుంది దాయాది దేశం.

author img

By

Published : Feb 2, 2021, 6:11 AM IST

కొవిడ్​పై పోరులో భాగంగా.. పాకిస్థాన్​కు 5 లక్షల కరోనా టీకా డోసులను ఉచితంగానే అందించింది చైనా. పాక్​ నుంచి పంపిన ప్రత్యేక విమానంలో.. వ్యాక్సిన్​ను ఎగుమతి చేసింది. రావల్పిండిలోని నూర్​ ఖాన్​ వైమానిక స్థావరం వద్ద చైనా రాయబారి నాంగ్​ రాంగ్​.. పాక్​ విదేశాంగ మంత్రి షా మహమూద్​ ఖురేషీకి వ్యాక్సిన్​ను అందజేశారు.

''అల్లా దయతో.. మొదటి విడతలో సినోఫార్మ్ వ్యాక్సిన్​ వచ్చేసింది. దీనికి సహకరించిన చైనాకు కృతజ్ఞతలు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్​లైన్​ హెల్త్​కేర్​ వర్కర్లకు సెల్యూట్​. వారికే మొదటగా టీకా ఇవ్వనున్నాం.''

- డా. ఫైసల్​ సుల్తాన్​, పాక్​ ఆరోగ్య శాఖ సలహాదారు

ఈ వారాంతంలోనే పాకిస్థాన్​ వ్యాక్సినేషన్​ ప్రారంభించనుంది. మొదటగా ఫ్రంట్​లైన్​ హెల్త్​ వర్కర్స్​కు వ్యాక్సిన్​ ఇవ్వనుంది పాక్​ ప్రభుత్వం. టీకా కోసం ఇప్పటికే ఆ దేశంలో 4 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు.

రెండో విడతలో భాగంగా చైనా నుంచి మరో 11 లక్షల టీకా డోసులను కొనుగోలు చేయనుంది పాక్​.

17 లక్షల డోసులు..

వీటితో పాటు.. ఈ ఏడాది ప్రథమార్థంలోగా పాకిస్థాన్​కు 17 లక్షల ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా టీకాను అంతర్జాతీయ టీకా సమన్వయ సంస్థ 'కోవాక్స్​' అందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్​ అలియన్స్​ ఫర్​ వాక్సినేషన్ అండ్​ ఇమ్యునైజేషన్ (జీఏవీఐ) కూటమితో 'కొవాక్స్​' ఏర్పడింది.

పాకిస్థాన్​లో ఇప్పటి వరకు 5,46,428 కరోనా కేసులు నమోదయ్యాయి. 1683 మంది మరణించారు.

ఇదీ చూడండి: కంబళ వీరుడు శ్రీనివాస.. ఈసారి ఓడిపోయాడు

కొవిడ్​పై పోరులో భాగంగా.. పాకిస్థాన్​కు 5 లక్షల కరోనా టీకా డోసులను ఉచితంగానే అందించింది చైనా. పాక్​ నుంచి పంపిన ప్రత్యేక విమానంలో.. వ్యాక్సిన్​ను ఎగుమతి చేసింది. రావల్పిండిలోని నూర్​ ఖాన్​ వైమానిక స్థావరం వద్ద చైనా రాయబారి నాంగ్​ రాంగ్​.. పాక్​ విదేశాంగ మంత్రి షా మహమూద్​ ఖురేషీకి వ్యాక్సిన్​ను అందజేశారు.

''అల్లా దయతో.. మొదటి విడతలో సినోఫార్మ్ వ్యాక్సిన్​ వచ్చేసింది. దీనికి సహకరించిన చైనాకు కృతజ్ఞతలు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్​లైన్​ హెల్త్​కేర్​ వర్కర్లకు సెల్యూట్​. వారికే మొదటగా టీకా ఇవ్వనున్నాం.''

- డా. ఫైసల్​ సుల్తాన్​, పాక్​ ఆరోగ్య శాఖ సలహాదారు

ఈ వారాంతంలోనే పాకిస్థాన్​ వ్యాక్సినేషన్​ ప్రారంభించనుంది. మొదటగా ఫ్రంట్​లైన్​ హెల్త్​ వర్కర్స్​కు వ్యాక్సిన్​ ఇవ్వనుంది పాక్​ ప్రభుత్వం. టీకా కోసం ఇప్పటికే ఆ దేశంలో 4 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు.

రెండో విడతలో భాగంగా చైనా నుంచి మరో 11 లక్షల టీకా డోసులను కొనుగోలు చేయనుంది పాక్​.

17 లక్షల డోసులు..

వీటితో పాటు.. ఈ ఏడాది ప్రథమార్థంలోగా పాకిస్థాన్​కు 17 లక్షల ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా టీకాను అంతర్జాతీయ టీకా సమన్వయ సంస్థ 'కోవాక్స్​' అందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్​ అలియన్స్​ ఫర్​ వాక్సినేషన్ అండ్​ ఇమ్యునైజేషన్ (జీఏవీఐ) కూటమితో 'కొవాక్స్​' ఏర్పడింది.

పాకిస్థాన్​లో ఇప్పటి వరకు 5,46,428 కరోనా కేసులు నమోదయ్యాయి. 1683 మంది మరణించారు.

ఇదీ చూడండి: కంబళ వీరుడు శ్రీనివాస.. ఈసారి ఓడిపోయాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.