ETV Bharat / international

అమెరికాతో పోరుకు సై అంటున్న కిమ్​!

author img

By

Published : Jun 18, 2021, 11:13 AM IST

అమెరికాతో చర్చలు జరపటం సహా ఆ దేశంతో సంఘర్షణకు సిద్దంగా ఉండాలని ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ తన అధికారులను ఆదేశించారు. అయితే.. చర్చల కంటే కూడా అమెరికాతో పోరుపైనే ఎక్కువ దృష్టి సారించాలని తెలిపారు. గురువారం జరిగిన తమ పార్టీ సమావేశంలో అమెరికాతో అనుసరించాల్సిన వ్యూహాలపై కిమ్​ చర్చించారు.

kim jong un, north korea president
నార్త్​ కొరియా, కిమ్​ జోంగ్​ ఉన్​

అమెరికాతో చర్చలు జరపటం సహా ఆ దేశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తరకొరియా దేశాధినేత కిమ్​ జోంగ్​ ఉన్ తన యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే.. చర్చల కంటే కూడా.. అమెరికాతో సంఘర్షణపైనే ఎక్కువ దృష్టిసారించాలని తెలిపారు. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మీడియా శుక్రవారం తెలిపింది. ఉత్తర కొరియా తమ అణు కార్యకలాపాలకు స్వస్తి చెప్పి, చర్చలకు రావాలని అమెరికా సహా ఇతర దేశాలు కోరిన కొన్ని రోజుల తర్వాత కిమ్​ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

కిమ్ తాజా ప్రకటనతో.. అణుకార్యకలాపాల్లో తమ దూకుడును పెంచి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​పై ఒత్తిడి తెచ్చేందుకు కిమ్​ యోచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో చర్చలకు కూడా ఆయన సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. గురువారం జరిగిన తమ పార్టీ సమావేశంలో.. అమెరికాతో అనుసరించాల్సిన వ్యూహాలపై కిమ్​ చర్చించారని 'కొరియన్ సెంట్రల్​ న్యూస్​ ఏజెన్సీ' పేర్కొంది. తమ దేశ గౌరవాన్ని కాపాడుకునేందుకు, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు.. అమెరికాతో పోరుకు సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలిపింది.

అమెరికాతో చర్చలు జరపటం సహా ఆ దేశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తరకొరియా దేశాధినేత కిమ్​ జోంగ్​ ఉన్ తన యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే.. చర్చల కంటే కూడా.. అమెరికాతో సంఘర్షణపైనే ఎక్కువ దృష్టిసారించాలని తెలిపారు. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మీడియా శుక్రవారం తెలిపింది. ఉత్తర కొరియా తమ అణు కార్యకలాపాలకు స్వస్తి చెప్పి, చర్చలకు రావాలని అమెరికా సహా ఇతర దేశాలు కోరిన కొన్ని రోజుల తర్వాత కిమ్​ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

కిమ్ తాజా ప్రకటనతో.. అణుకార్యకలాపాల్లో తమ దూకుడును పెంచి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​పై ఒత్తిడి తెచ్చేందుకు కిమ్​ యోచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో చర్చలకు కూడా ఆయన సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. గురువారం జరిగిన తమ పార్టీ సమావేశంలో.. అమెరికాతో అనుసరించాల్సిన వ్యూహాలపై కిమ్​ చర్చించారని 'కొరియన్ సెంట్రల్​ న్యూస్​ ఏజెన్సీ' పేర్కొంది. తమ దేశ గౌరవాన్ని కాపాడుకునేందుకు, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు.. అమెరికాతో పోరుకు సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉత్తర కొరియా: కిమ్​

ఇదీ చూడండి: మనకు ఆకలి కేకలు తప్పవు: కిమ్​

కిమ్, జిన్​పింగ్ స్నేహగీతం- అమెరికానే లక్ష్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.