ETV Bharat / international

ఉత్తర కొరియా దూకుడు.. మరోసారి కీలక పరీక్షలు - North Korea conducts 'very important test': KCNA

అణ్వాయుధ నిరాయుధీకరణపై అమెరికాతో చర్చలు తిరిగి ప్రారంభమౌతాయన్న దశలో ఉత్తర కొరియా మరోసారి దుందుడుకు చర్యలకు దిగింది. అత్యంత కీలకమైన పరీక్షలను నిర్వహించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. అయితే తాజా పరీక్షలు క్షిపణి పరీక్షలేనా అన్న అంశపై స్పష్టత ఇవ్వలేదు.

korea
ఉత్తరకొరియా మరోసారి కీలక పరిక్షలు
author img

By

Published : Dec 8, 2019, 10:09 AM IST

ఉత్తర కొరియా మరోసారి అత్యంత కీలకమైన పరీక్షలను నిర్వహించింది. గత సోమవారం తమ సోహీ ఉపగ్రహ ప్రయోగ వేదిక నుంచి ఈ పరీక్షను చేసినట్లు వెల్లడించింది. అయితే అది క్షిపణి పరీక్షా కాదా అన్న విషయమై స్పష్టీకరించలేదు కిమ్ ​దేశం.

"2019 డిసెంబర్ 7న సోహే ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఓ కీలకమైన పరీక్ష నిర్వహించాం."

-ఉత్తర కొరియా సైన్స్ అకాడమి ప్రకటన

ఈ పరీక్షల కారణంగా వ్యూహాత్మకంగా ఉత్తర కొరియా మరింత బలోపేతమవుతుందని కిమ్​ దేశ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్​ఏ వ్యాఖ్యానించింది. అమెరికాతో అణ్వాయుధ నిరాయుధీకరణ చర్చలు పుఃన ప్రారంభమౌతాయన్న వార్తల నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్షలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత మే నెల నుంచి ఇప్పటివరకు 12 సార్లు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించింది.

ట్రంప్​పై తీవ్ర వ్యాఖ్యలు

తమకు బలమైన సైన్యం ఉందని కానీ దానిని ఉపయోగించకూడదని ఆశిస్తున్నామంటూ ​నాటో సదస్సు వేదికగా ఉత్తర కొరియా వైఖరిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు ఉత్తర కొరియా విదేశాంగమంత్రి. ట్రంప్​ను వివేకం లేని వ్యక్తిగా అభివర్ణించారు.

ఇదీ చూడండి: రాజకీయ బాసుల ప్రభావంతో అవినీతి నిరోధక అఫిడ'విట్లు'

ఉత్తర కొరియా మరోసారి అత్యంత కీలకమైన పరీక్షలను నిర్వహించింది. గత సోమవారం తమ సోహీ ఉపగ్రహ ప్రయోగ వేదిక నుంచి ఈ పరీక్షను చేసినట్లు వెల్లడించింది. అయితే అది క్షిపణి పరీక్షా కాదా అన్న విషయమై స్పష్టీకరించలేదు కిమ్ ​దేశం.

"2019 డిసెంబర్ 7న సోహే ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఓ కీలకమైన పరీక్ష నిర్వహించాం."

-ఉత్తర కొరియా సైన్స్ అకాడమి ప్రకటన

ఈ పరీక్షల కారణంగా వ్యూహాత్మకంగా ఉత్తర కొరియా మరింత బలోపేతమవుతుందని కిమ్​ దేశ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్​ఏ వ్యాఖ్యానించింది. అమెరికాతో అణ్వాయుధ నిరాయుధీకరణ చర్చలు పుఃన ప్రారంభమౌతాయన్న వార్తల నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్షలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత మే నెల నుంచి ఇప్పటివరకు 12 సార్లు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించింది.

ట్రంప్​పై తీవ్ర వ్యాఖ్యలు

తమకు బలమైన సైన్యం ఉందని కానీ దానిని ఉపయోగించకూడదని ఆశిస్తున్నామంటూ ​నాటో సదస్సు వేదికగా ఉత్తర కొరియా వైఖరిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు ఉత్తర కొరియా విదేశాంగమంత్రి. ట్రంప్​ను వివేకం లేని వ్యక్తిగా అభివర్ణించారు.

ఇదీ చూడండి: రాజకీయ బాసుల ప్రభావంతో అవినీతి నిరోధక అఫిడ'విట్లు'

Kolkata (West Bengal), Dec 08 (ANI): While speaking to media in Kolkata on December 07, Meghalaya Governor Tathagata Roy spoke about the Telangana woman rape and murder case which took place near Hyderabad on November 27. He said, "I can never accept that encounter or kangaroo courts can ever be the standard operating procedure in dispensing criminal justice. People ought to be arrested, taken before the court, chargesheeted, then tried and ultimately the court will hand out punishment to them which is to be carried out." "But catching hold of people somewhere out and shooting them, holding kangaroo courts-these are out of the question as a standard operating procedure.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.