ETV Bharat / international

భారత్​ సహా ప్రపంచ దేశాలకు నేపాల్​ కొత్త మ్యాప్​! - International community

ఇటీవల విడుదల చేసిన కొత్త మ్యాప్​ను భారత్​ సహా అంతర్జాతీయ సమాజానికి అందించాలని భావిస్తున్నట్లు తెలిపింది నేపాల్​. అందుకోసం ఆంగ్ల భాషలో 4వేల కాపీలను సిద్ధం చేయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియ ఆగస్టు మధ్య నాటికి పూర్తవుతుందని స్పష్టం చేసింది.

Nepal to send updated map to India
భారత్​ సహా అంతర్జాతీయ సమాజానికి నేపాల్​ కొత్త మ్యాప్​!
author img

By

Published : Aug 2, 2020, 5:21 AM IST

Updated : Aug 2, 2020, 8:16 AM IST

భారత భూగాలైన కాలాపానీ, లిపులేఖ్​, లింపియాధురాలతో ఇటీవల విడుదల చేసిన కొత్త మ్యాప్​ను అంతర్జాతీయ సమాజానికి పంపాలని భావిస్తున్నట్లు ప్రకటించింది నేపాల్​. ఆగస్టు మధ్య నాటికి భారత్​, గూగుల్​ సహా ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య సంస్థలకు పంపాలని నిర్ణయించినట్లు ఆ దేశ భూ నిర్వహణ శాఖ మంత్రి తెలిపారు.

"కాలాపానీ, లిపులేఖ్​, లింపియాధురా భూబాగాలు ఉన్న నవీకరించిన మ్యాప్​ను వివిధ ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య సంస్థలు, గూగుల్​, భారత్​ సహా అంతర్జాతీయ సమాజాలకు త్వరలోనే పంపుతాం. ఆగస్టు మధ్య నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది."

- పద్మ ఆర్యాల్​, భూ నిర్వహణ, సహకారం, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి.

4 వేల కాపీలు..

ప్రపంచ దేశాలకు పంపేందుకు నేపాల్​ కొత్త మ్యాప్​లను ఆంగ్ల భాషలో 4 వేల కాపీలు సిద్ధ చేయాలని కొలతల శాఖను ఆదేశించారు మంత్రి. ఇప్పటికే 25వేల కొత్త మ్యాప్​ కాపీలు ప్రింట్​ చేసింది కొలతల శాఖ. వీటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా ఇవ్వగా ప్రజలకు ఆ దేశ కరెన్సీ రూ. 50కి అందుబాటులో ఉంచారు.

మే 20న విడుదల..

భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్​, లింపియాధురా​లను కలుపుకుని కొత్త మ్యాప్​ను మే 20 విడుదల చేసింది నేపాల్​ ప్రభుత్వం. దానికి పార్లమెంట్​ ఆమోదం తెలిపింది.

నేపాల్​ ఏకపక్ష నిర్ణయాన్ని భారత్​ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి చారిత్రక ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. ఈ నిర్ణయం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దౌత్య చర్చల ద్వారానే సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి: 'భారత్​-చైనా బంధమే ఆసియా భవిష్యత్తును నిర్ణయిస్తుంది'

భారత భూగాలైన కాలాపానీ, లిపులేఖ్​, లింపియాధురాలతో ఇటీవల విడుదల చేసిన కొత్త మ్యాప్​ను అంతర్జాతీయ సమాజానికి పంపాలని భావిస్తున్నట్లు ప్రకటించింది నేపాల్​. ఆగస్టు మధ్య నాటికి భారత్​, గూగుల్​ సహా ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య సంస్థలకు పంపాలని నిర్ణయించినట్లు ఆ దేశ భూ నిర్వహణ శాఖ మంత్రి తెలిపారు.

"కాలాపానీ, లిపులేఖ్​, లింపియాధురా భూబాగాలు ఉన్న నవీకరించిన మ్యాప్​ను వివిధ ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య సంస్థలు, గూగుల్​, భారత్​ సహా అంతర్జాతీయ సమాజాలకు త్వరలోనే పంపుతాం. ఆగస్టు మధ్య నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది."

- పద్మ ఆర్యాల్​, భూ నిర్వహణ, సహకారం, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి.

4 వేల కాపీలు..

ప్రపంచ దేశాలకు పంపేందుకు నేపాల్​ కొత్త మ్యాప్​లను ఆంగ్ల భాషలో 4 వేల కాపీలు సిద్ధ చేయాలని కొలతల శాఖను ఆదేశించారు మంత్రి. ఇప్పటికే 25వేల కొత్త మ్యాప్​ కాపీలు ప్రింట్​ చేసింది కొలతల శాఖ. వీటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఉచితంగా ఇవ్వగా ప్రజలకు ఆ దేశ కరెన్సీ రూ. 50కి అందుబాటులో ఉంచారు.

మే 20న విడుదల..

భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్​, లింపియాధురా​లను కలుపుకుని కొత్త మ్యాప్​ను మే 20 విడుదల చేసింది నేపాల్​ ప్రభుత్వం. దానికి పార్లమెంట్​ ఆమోదం తెలిపింది.

నేపాల్​ ఏకపక్ష నిర్ణయాన్ని భారత్​ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి చారిత్రక ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. ఈ నిర్ణయం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దౌత్య చర్చల ద్వారానే సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

ఇదీ చూడండి: 'భారత్​-చైనా బంధమే ఆసియా భవిష్యత్తును నిర్ణయిస్తుంది'

Last Updated : Aug 2, 2020, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.