ETV Bharat / international

పాక్​ మాజీ ప్రధానికి తీవ్ర అనారోగ్యం

పాక్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. లండన్​లో ఉన్న ఆయనకు కొత్తగా మూత్రపిండాల్లో సమస్య తలెత్తినట్లు పలు వార్తాపత్రికలు పేర్కొన్నాయి. కిడ్నీలో రాళ్ల కారణంగా.. తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.

author img

By

Published : Nov 19, 2020, 5:41 PM IST

Updated : Nov 19, 2020, 7:38 PM IST

Nawaz Sharif makes unscheduled hospital visits after developing kidney pain: report
తీవ్ర అనారోగ్యం బారిన పాక్​ మాజీ ప్రధాని!

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​.. తీవ్రమైన అనారోగ్యం బారినపడ్డారని మీడియా నివేదికలు వెల్లడించాయి. లండన్​లో చికిత్స పొందుతున్న ఆయనకు కిడ్నీలో రాళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తీవ్ర నొప్పితో ఆస్పత్రులకు తిరుగుతున్నట్లు సమాచారం.

Nawaz Sharif makes unscheduled hospital visits after developing kidney pain: report
ఆస్పత్రిలో పాక్​ మాజీ ప్రధాని

''నవాజ్​ షరీఫ్​కు ఆరోగ్యం ఏం బాగోలేదు. మూత్రపిండాల పనితీరు క్షీణించడం వల్ల.. ఆయన తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. ఆయన వైద్యచికిత్సకు సంబంధించి.. పరీక్షలు, స్కానింగ్​లు నిర్వహిస్తున్నట్లు'' వైద్యుడు అద్నాన్​ ఖాన్ అన్న మాటలను​ డాన్​ పత్రిక ఉటంకించింది.

కిడ్నీ నొప్పుల కారణంగా.. తన తండ్రి పాకిస్థాన్​ డెమొక్రాటిక్​ మూవ్​మెంట్​లో పాల్గొనలేకపోతున్నారని షరీఫ్​ కుమార్తె మరియం నవాజ్​ మంగళవారం ట్వీట్​ చేశారు.

ఆ కేసుల్లో బెయిల్​పై..

అవెన్​ఫీల్డ్​ ఆస్తుల కేసులో.. షరీఫ్​తో పాటు ఆయన కూతురు మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్దార్​లపై 2018, జులై 6న కేసు నమోదైంది. 2017లో ప్రధాని పదవి కోల్పోయిన ఆయనకు.. ఆల్​ అజీజ్​ స్టీల్​ మిల్స్​ కేసులో ఏడేళ్ల శిక్ష పడింది.

ఈ రెండు కేసుల్లో బెయిల్​ పొందిన ఆయన చికిత్స నిమిత్తం లండన్​ వెళ్లి అక్కడే ఉండిపోయారు.

పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​.. తీవ్రమైన అనారోగ్యం బారినపడ్డారని మీడియా నివేదికలు వెల్లడించాయి. లండన్​లో చికిత్స పొందుతున్న ఆయనకు కిడ్నీలో రాళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తీవ్ర నొప్పితో ఆస్పత్రులకు తిరుగుతున్నట్లు సమాచారం.

Nawaz Sharif makes unscheduled hospital visits after developing kidney pain: report
ఆస్పత్రిలో పాక్​ మాజీ ప్రధాని

''నవాజ్​ షరీఫ్​కు ఆరోగ్యం ఏం బాగోలేదు. మూత్రపిండాల పనితీరు క్షీణించడం వల్ల.. ఆయన తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. ఆయన వైద్యచికిత్సకు సంబంధించి.. పరీక్షలు, స్కానింగ్​లు నిర్వహిస్తున్నట్లు'' వైద్యుడు అద్నాన్​ ఖాన్ అన్న మాటలను​ డాన్​ పత్రిక ఉటంకించింది.

కిడ్నీ నొప్పుల కారణంగా.. తన తండ్రి పాకిస్థాన్​ డెమొక్రాటిక్​ మూవ్​మెంట్​లో పాల్గొనలేకపోతున్నారని షరీఫ్​ కుమార్తె మరియం నవాజ్​ మంగళవారం ట్వీట్​ చేశారు.

ఆ కేసుల్లో బెయిల్​పై..

అవెన్​ఫీల్డ్​ ఆస్తుల కేసులో.. షరీఫ్​తో పాటు ఆయన కూతురు మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్దార్​లపై 2018, జులై 6న కేసు నమోదైంది. 2017లో ప్రధాని పదవి కోల్పోయిన ఆయనకు.. ఆల్​ అజీజ్​ స్టీల్​ మిల్స్​ కేసులో ఏడేళ్ల శిక్ష పడింది.

ఈ రెండు కేసుల్లో బెయిల్​ పొందిన ఆయన చికిత్స నిమిత్తం లండన్​ వెళ్లి అక్కడే ఉండిపోయారు.

Last Updated : Nov 19, 2020, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.