ETV Bharat / international

సడలించకపోతే ​ఆకలి కేకలు మారుమోగేవి: ప్రధాని

దేశంలో లాక్‌డౌన్ సడలించకపోతే లక్షలాది మంది ఆకలితో అలమటించేవారని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ అన్నారు​. ఐరోపా, అమెరికాల్లో​ విస్తరించినంత వేగంగా పాకిస్థాన్​, భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వైరస్​ విస్తరించట్లేదన్నారు. అందుకే లాక్​డౌన్​ ఎత్తివేసేందుకే నిర్ణయించినట్లు స్పష్టం చేశారు​.

author img

By

Published : May 21, 2020, 10:45 AM IST

Millions would have starved if COVID-19 lockdown was not eased: Pak PM
సడలించకపోతే ​ఆకలి కేకలు మారుమోగేవి: ప్రధాని

కేసులు పెరుగుతున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను సడలించడాన్ని సమర్థించుకున్నారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. లాక్​డౌన్​ సడలించకపోతే.. దేశంలో ఆకలి చావులు పుట్టుకొచ్చేవన్నారు. పాకిస్థాన్​ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు.. "ప్రజలను కరోనా నుంచి కాపాడాలా.. లేదా వారి ఆకలి తీర్చి ప్రాణాలు కాపాడాలా?" అనే ప్రశ్నలతో సందిగ్ధంలో పడ్డాయన్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్థితిని వివరిస్తూ.. ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి మాట్లాడిన ఓ వీడియోలో ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"మేము రెండు సవాళ్లను ఎదుర్కోవాలి. ఒకటి వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవడమైతే.. మరొకటి లాక్​డౌన్ వల్ల పెరుగుతున్న పేదరికం ప్రభావాన్ని తగ్గించడం. మా దేశంలో లక్షలాది మంది రోజువారి కూలీపని చేసుకోలేక, అలా అని సొంత వ్యాపారాలు చేసుకోలేని వారు దాదాపు 2.5కోట్ల మంది. లాక్​డౌన్​ కారణంగా వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. అంటే దాదాపు 15 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు."

-ఇమ్రాన్​ ఖాన్​, పాక్​ ప్రధాని.

ఐరోపా, అమెరికాల్లో​ విస్తరించినంత వేగంగా పాకిస్థాన్​, భారత్, బంగ్లాదేశ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైరస్​ వ్యాపించట్లేదని పేర్కొన్నారు ఇమ్రాన్​. పాక్​ ప్రభుత్వం లాక్​డౌన్​ కారణంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్న పేదలకు డబ్బులు సాయం చేయాలనే కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటికే ఒక కోటి 50 లక్షల మంది డబ్బులు తీసుకుని లబ్ధి పొందారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'కాలాపానీ'పై నేపాల్​కు భారత్​ కౌంటర్-చారిత్రక ఆధారాలేవి!

కేసులు పెరుగుతున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను సడలించడాన్ని సమర్థించుకున్నారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. లాక్​డౌన్​ సడలించకపోతే.. దేశంలో ఆకలి చావులు పుట్టుకొచ్చేవన్నారు. పాకిస్థాన్​ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు.. "ప్రజలను కరోనా నుంచి కాపాడాలా.. లేదా వారి ఆకలి తీర్చి ప్రాణాలు కాపాడాలా?" అనే ప్రశ్నలతో సందిగ్ధంలో పడ్డాయన్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్థితిని వివరిస్తూ.. ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి మాట్లాడిన ఓ వీడియోలో ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"మేము రెండు సవాళ్లను ఎదుర్కోవాలి. ఒకటి వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవడమైతే.. మరొకటి లాక్​డౌన్ వల్ల పెరుగుతున్న పేదరికం ప్రభావాన్ని తగ్గించడం. మా దేశంలో లక్షలాది మంది రోజువారి కూలీపని చేసుకోలేక, అలా అని సొంత వ్యాపారాలు చేసుకోలేని వారు దాదాపు 2.5కోట్ల మంది. లాక్​డౌన్​ కారణంగా వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. అంటే దాదాపు 15 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు."

-ఇమ్రాన్​ ఖాన్​, పాక్​ ప్రధాని.

ఐరోపా, అమెరికాల్లో​ విస్తరించినంత వేగంగా పాకిస్థాన్​, భారత్, బంగ్లాదేశ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైరస్​ వ్యాపించట్లేదని పేర్కొన్నారు ఇమ్రాన్​. పాక్​ ప్రభుత్వం లాక్​డౌన్​ కారణంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్న పేదలకు డబ్బులు సాయం చేయాలనే కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటికే ఒక కోటి 50 లక్షల మంది డబ్బులు తీసుకుని లబ్ధి పొందారని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'కాలాపానీ'పై నేపాల్​కు భారత్​ కౌంటర్-చారిత్రక ఆధారాలేవి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.